రాధను విక్రమ్ ఇంటికి తీసుకు వస్తాడు. శీనయ్య మీద జరిగిన అటాక్, విక్రమ్ కాపాడిన సంగతిని చెబుతుంది రాధ. పెద్ద ప్రమాదం జరిగేదని అంతా అంటారు. అంత కంటే పెద్ద ప్రమాదమే వచ్చేలా చేసింది..
మా కోడలు పుట్టింటికి వెళ్లిందని, అగ్రిమెంట్ మ్యారేజ్ అని, విక్రమ్ని కొట్టిందని ఏవేవో చెప్పారు కదా అని సునంద అంటుంది. దీంతో దమయంతికి రాధ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. మాది అగ్రిమెంట్ మ్యారేజా? మీరు సాక్షి సంతకం పెట్టారా? మీ కూతురు పెట్టిందా? మీరు చూశారా?.. మాది నిజమైన ప్రేమ.. మేం ఎప్పటికీ విడిపోం.. నాకు పడిన మూడు ముళ్లు ఏ చిక్కు ముడి వచ్చినా వీగదు.. చివరకు ఆ బ్రహ్మ దిగి వచ్చినా కూడా ఆ ముడిని విప్పలేడు.. నా ఊపిరి ఉన్నంత వరకు నేను ఇక్కడే ఉంటా.. ఆయనతోనే ఉంటాను.. మా ఆయన భాషలో నేను చెప్పాలంటే.. నువ్వులేక నేనులేను.. ఆయన నాతో పదే పదే చెప్పే ఆ మాటే ఇప్పుడు నేను చెబుతున్నాను.. నువ్వులేక నేనులేను.. ఇద్దరం ఇలానే కలిసి ఉంటాం అని రాధ అంటుంది. అత్తయ్య ఇంకోసారి మా గురించి ఎవ్వరేం చెప్పినా వినకండి.. నమ్మకండి అని రాధ అంటుంది.ఇక రాధ మాటలకు విక్రమ్ అయోమయంలో పడిపోతాడు. ఫ్లోలో చెప్పిందా? ఫీల్ అయి చెప్పిందా? సొంత భర్త గురించి సొంత భార్య కూడా అలా చెప్పదే అని విక్రమ్ గాల్లో రాతలు రాస్తూ ఆలోచిస్తుంటాడు. ఏంటండి.. అంత ఆలోచిస్తున్నారు అని రాధ అడుగుతుంది. నువ్వు ఇందాక చెప్పిన మాటలు ఫ్లోలో చెప్పావా? ఫీలై చెప్పావా? వాళ్లని నమ్మించడానికే కదా అని విక్రమ్ అడుగుతాడు. దీంతో విక్రమ్ని కాసేపు ఆట పట్టిస్తుంది రాధ. నేను మీకు ఎప్పటికీ అర్థం కాను.. ఫీల్ అయి చెప్పాను.. లేదు లేదు ఫ్లోలో చెప్పాను.. లేదు లేదు ఫ్లోలో ఫీలై అయి చెప్పాను అని కన్ఫ్యూజ్ చేసేస్తుంది రాధ.🔹‘పొదరిల్లు’ టుడే ఎపిసోడ్ : కేశవని కుటుంబానికి దూరం చేస్తుందా?.. మార్చేస్తా అని చెప్పిన శైలు.. చక్రి దెబ్బకు డిస్టర్బ్ అయిన మహాఇంకో వైపు భవానీ శంకర్ను దమయంతి తిడుతుంది. ఏంటి అన్నయ్య ఇలా చేశావ్.. ప్లాన్ ఏ, ప్లాన్ బీ అని పెట్టుకోవాలి కదా.. ఇంకో పది మందిని పంపించాల్సింది.. అప్పుడు విక్రమ్ వచ్చి కాపాడే వాడు కాదు కదా అని అంటుంది దమయంతి. దీంతో భవానీ శంకర్ షాక్ అవుతాడు. మన వాళ్లు అసలు అటాకే చేయలేదు.. శీనయ్యని హాస్పిటల్ పాలు చేయాల్సిన వాళ్లు.. యాక్సిడెంట్ జరగడంతో వాళ్లే హాస్పిటల్లో చేరారు అని భవానీ శంకర్ అంటాడు. మరి ఆ అటాక్ చేయించింది ఎవరు? అని ఇద్దరూ ఆలోచనల్లో పడతారు.🔹‘గుండెనిండా గుడిగంటలు’ టుడే ఎపిసోడ్: టైం చూసి దెబ్బ కొట్టిన బాలు.. అరుణ్ ఉద్యోగం ఊడుతుందా?.. సుందరి పెళ్లిలో రోహిణి ఖేల్ ఖతంమందు సిట్టింగ్లో కూర్చున్న విక్రమ్, రామలింగం సరదాగా మాట్లాడుకుంటారు. ఇదంతా దేవుడి దయే రా.. సడెన్గా అటాక్ ఏంటి? నువ్వు హీరోలా కాపాడటం ఏంటి? రాధ ఇంటికి రావడం ఏంటి? అని రామలింగం అంటాడు. అంతా దేవుడి దయే కానీ.. అటాక్ మాత్రం నా దయ అని అసలు విషయం విక్రమ్ చెప్పడంతో రామలింగం షాక్ అవుతాడు. ఆ అటాక్ ప్లాన్ చేసింది నేనే.. నాకు వేరే దారి లేదు.. అని విక్రమ్ అంటాడు. ఈ విషయం రాధమ్మకి తెలిస్తే ఇక జీవితంలో నిన్ను క్షమించదు జాగ్రత్త అని అంటాడు రామలింగం.ఇక ఉదయాన్నే స్టోర్ రూంలో చిట్టి గీసిన బొమ్మని చూస్తుంది రాధ. ఇదేంటి ఎక్కడో చూసినట్టుగా ఉందే అని రాధ అనుకుని సునందని అడుగుతుంది. ఇది చిట్టి గీసింది.. అన్నయ్య బర్త్ డేకి గిఫ్ట్గా ఇచ్చింది.. దీని తర్వాతే చిట్టి దూరమైంది.. అప్పటి నుంచి బర్త్ డే కూడా సెలెబ్రేట్ చేసుకోవడం లేదు.. మళ్లీ చిట్టి వచ్చాకే బర్త్ డే చేసుకుంటానని అన్నయ్య అంటున్నాడు.. ఇంత వరకు చిట్టి రాలేదు.. బర్త్ డే జరగలేదు అని సునంద చెబుతూ కన్నీరు పెట్టుకుంటుంది. అంతటితో ఎపిసోడ్ పూర్తవుతుంది.