
ఆమిర్ఖాన్ నిర్మాణంలో, కిరణ్రావు దర్శకత్వంలో వచ్చి ఆస్కార్స్ రేసు వరకు వెళ్లిన సూపర్ హిట్ చిత్రం 'లాపతా లేడీస్'.
ఈ సినిమాలో 'చోటూ' పాత్రతో మెప్పించిన నటుడు సత్యేంద్ర సోనికి చిత్ర పరిశ్రమలో ఘోర అవమానం ఎదురైంది. తనకు రావాల్సిన రెమ్యునరేషన్ అడిగినందుకు ఒక చిత్ర దర్శకుడు నడిరోడ్డుపై భౌతిక దాడికి పాల్పడ్డాడని, తనను చంపేస్తామని బెదిరించాడంటూ సత్యేంద్ర సోని సోషల్ మీడియాలో కన్నీరు పెడుతూ పెట్టిన వీడియో ఇప్పుడు బాలీవుడ్లో సంచలనం సృష్టిస్తోంది.మధ్యప్రదేశ్లోని మైహార్లో జరుగుతున్న 'పేడ్ పాల్కి' చిత్ర షూటింగ్ స్పాట్లో ఈ ఘటన జరిగింది. సత్యేంద్ర సోని తెలిపిన వివరాల ప్రకారం.. ఈ సినిమాకు పుష్పేంద్ర సింగ్ దర్శక-నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. సినిమా సైనింగ్ అమౌంట్గా రూ. 50,000 ఇచ్చిన చిత్ర బృందం, మిగిలిన మొత్తాన్ని షూటింగ్ ముగిశాక ఇస్తామని ఒప్పందం చేసుకుంది. దాదాపు 8 రోజుల పాటు షూటింగ్లో పాల్గొన్న సత్యేంద్ర, తన మిగిలిన డబ్బుల గురించి అడగడంతో డైరెక్టర్ పుష్పేంద్ర ఆగ్రహంతో ఊగిపోయాడు. 10 నిమిషాల్లో హోటల్ రూమ్ ఖాళీ చేసి వెళ్ళిపోవాలని, మళ్లీ ఇక్కడ కనిపిస్తే చంపేస్తానని హెచ్చరించాడు. ఆ సినిమా హీరోయిన్, డైరెక్టర్ భార్య అయిన ప్రగతి చౌహాన్ కూడా తనను బూతులు తిడుతూ హోటల్ నుంచి గెంటివేసిందని సత్యేంద్ర కన్నీరు పెట్టుకున్నాడు.అంతటితో ఆగకుండా, భయంతో హోటల్ నుంచి బయటకు వచ్చేసిన సత్యేంద్ర, సహ నటులు శ్రీధర్ దూబే, పంకజ్ శర్మలను డైరెక్టర్ పుష్పేంద్ర, ఆయన భార్య కారులో వెంబడించారు. నడిరోడ్డుపై తమను అడ్డుకుని మొబైల్ ఫోన్ లాక్కునే