
ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని తల్లిదండ్రులకు మంత్రి దామోదర రాజనర్సింహ పిలుపునిచ్చారు. పోలియో రహిత తెలంగాణ లక్ష్యంగా తమ ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని తెలిపారు.
హైదరాబాద్, జూన్ 28 (ఆంధ్రజ్యోతి): ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని తల్లిదండ్రులకు తెలంగాణ ఆరోగ్య, వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ (Minister Damodara Raja Narasimha) పిలుపునిచ్చారు. పోలియో రహిత తెలంగాణ లక్ష్యంగా తమ ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని తెలిపారు. ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు అందేలా ఆరోగ్య శాఖ అధికారులు, వైద్య సిబ్బంది విస్తృత చర్యలు చేపడుతున్నారని వివరించారు.
బోరబండ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమాన్ని మంత్రి దామోదర రాజనర్సింహ చిన్నారులకు పోలియో చుక్కలు వేసి ఈరోజు(ఆదివారం) ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్, పొన్నం ప్రభాకర్, రాజ్యసభ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ప్రియాంక అల, ఆరోగ్య శాఖ అధికారులు, వైద్య సిబ్బంది, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
తెలంగాణ రైజింగ్ విజన్కు ప్రపంచ దిగ్గజ కంపెనీల మద్దతు: సీఎం రేవంత్ రెడ్డి
సీషెల్స్ పర్యటనలో గ్లోబల్ సౌత్ ప్రయోజనాలను ముందుకు తీసుకెళ్తాం: ప్రధాని మోదీ
Read Latest Telangana News And AP News And National News