
సీషెల్స్లో పర్యటిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ అక్కడి నేషనల్ బొటానికల్ గార్డెన్ను సందర్శించారు. ఈ సందర్భంగా ఓ మొక్కను నాటారు. అనంతరం ప్రపంచంలోని అత్యంత వృద్ధజీవిగా గుర్తింపు పొంది
న ‘జొనాథన్’ అనే తాబేలును మోదీ ఆసక్తిగా తిలకించారు. దానికి ఆహారం తినిపించారు. జొనాథన్ గురించి బొటానికల్ గార్డెన్స్ సిబ్బంది ప్రధాని మోదీకి వివరించారు. ఆ తాబేలు వయసు సుమారు 194 సంవత్సరాలు. 50 ఏళ్ల వయసు ఉన్నప్పుడు 1882లో సెయింట్ హెలీనా ద్వీపానికి తీసుకువచ్చారు. ప్రస్తుతం సీషెల్స్ నేషనల్ బొటానికల్ గార్డెన్లో ఉంటోంది. 194 ఏళ్ల వయసులోనూ జొనాథన్ ఆరోగ్యంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ వార్త చదివారా: హర్మూజ్లో మరో ట్యాంకర్పై క్షిపణి దాడి