
మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు.
గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
EPF Withdrawal New Rules: దేశంలోని వ్యవస్థీకృత ప్రైవేట్ రంగ ఉద్యోగులకు మెరుగైన డిజిటల్ సేవలను అందించడానికి ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఒక డిజిటల్ ప్లాట్ఫామ్ను ప్రారంభించింది. ఈపీఎఫ్ఓ తన డేటాబేస్, క్లెయిమ్ల ప్రాసెసింగ్ వ్యవస్థను అప్గ్రేడ్ చేస్తోంది. ఈ సాఫ్ట్వేర్ అప్గ్రేడ్ కారణంగా.. జూన్ 26 నుండి జూన్ 30 వరకు 5 రోజుల పాటు కొత్త PF క్లెయిమ్లు స్వీకరించదు. ఈ కాలంలో క్లెయిమ్ ప్రాసెసింగ్ కూడా తాత్కాలికంగా నిలిపివేస్తుంది. జూన్ 26కి ముందు సమర్పించిన క్లెయిమ్లు రద్దవ్వవు. ఈపీఎఫ్ఓ ప్రకారం.. సిస్టమ్ అప్గ్రేడ్ పూర్తయిన తర్వాత, జూలై 1, 2026 నుండి EPFO సేవలు తిరిగి ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
EPFO జారీ చేసిన నోటీసు ప్రకారం.. EPFO మెంబర్ పోర్టల్, ఎంప్లాయర్ పోర్టల్, UMANG యాప్లోని అనేక సేవలు జూన్ 26, 2026న అర్ధరాత్రి 12 గంటల నుండి జూన్ 30, 2026న రాత్రి 11:59 గంటల వరకు మొత్తం 120 గంటల పాటు తాత్కాలికంగా నిలిచిపోతాయి. లక్షలాది మంది ఉద్యోగుల పదవీ విరమణ నిధులను నిర్వహించే ఈ ప్రభుత్వ సంస్థ.. సమయంలో సిస్టమ్ మైగ్రేషన్, డేటాబేస్ అప్గ్రేడ్లు నిర్వహిస్తుందని.. తద్వారా భవిష్యత్తులో వేగవంతమైన, మరింత సురక్షితమైన సేవలను అందిస్తామని తెలిపింది.
సిస్టమ్ అప్గ్రేడ్ల సమయంలో ఈ సేవలు అందుబాటులో ఉండవు:
-కొత్త PF క్లెయిమ్ను సమర్పించడం సాధ్యం కాదు.
-క్లెయిమ్ ప్రాసెసింగ్ తాత్కాలికంగా నిలిచిపోతుంది.
-కొత్త ఉద్యోగులకు UAN లింకింగ్ సాధ్యం కాదు.
-ఇ-పాస్బుక్ సౌకర్యం కూడా అందుబాటులో ఉండదు.
జూన్ 26వ తేదీకి ముందు సమర్పించిన క్లెయిమ్లు రద్దవ్వవు. సేవలు పునరుద్ధించిన తర్వాత వాటి ప్రాసెసింగ్ తిరిగి ప్రారంభమవుతుంది.
సిస్టమ్ అప్గ్రేడ్ పూర్తయిన తర్వాత.. EPFO జూలై ప్రారంభంలో తన సభ్యుల కోసం UPI ద్వారా PF ఉపసంహరణల సౌకర్యాన్ని ప్రారంభించే అవకాశం ఉంది. సభ్యులు PF నిధులను విత్ డ్రా చేసుకునేందుకు క్లెయిమ్ దరఖాస్తును సమర్పించాలి. ఆ నిధులు వారి ఖాతాలలో జమ కావడానికి సాధారణంగా 1 నుండి 2 వారాల సమయం పడుతుంది. చాలా సందర్భాలలో, క్లెయిమ్లు తిరస్కరణకు గురవుతాయి. కొత్త వ్యవస్థ అమలులోకి వచ్చిన తర్వాత ఉపసంహరణ ప్రక్రియ చాలా సులభంగా.. వేగంగా ఉంటుందని ఈపీఎఫ్ఓ చెబుతోంది. అయితే, క్లెయిమ్ అభ్యర్థన లేకుండా PF ఉపసంహరణ సౌకర్యం లేదా దాని నియమాల గురించి EPFO ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు.
ప్రస్తుత నిబంధనల ప్రకారం, ఈపీఎఫ్ బ్యాలెన్స్లో కనీసం 25శాతం ఖాతాలోనే ఉంచి మిగలిన మొత్తాన్ని మాత్రమే విత్ డ్రా చేసుకునేవిధంగా ఇప్పటికే సీబీటీ ఆమోదం తెలిపింది. తరచుగా విత్ డ్రా చేసుకునే కార్మికులకు రిటైర్మెంట్ సమయంలో చేతులు ఉండటం లేదని గుర్తించింది. చేతికి 20వేలు కూడా రాని కార్మికుల సంఖ్య ఎక్కువ ఉన్నట్లు అధ్యయనంలో తేలింది. ఈ నేపథ్యంలో రిటైర్మెంట్ తర్వాత కార్మికులు గౌరవప్రదమైన జీవనం కొనసాగించేందుకు వీలుగా 25శాతం కనీస నిల్వగా నిర్ణయించింది. అంటే ప్రతి ఉద్యోగి క్లెయిమ్ దరఖాస్తు నాటికి ఉద్యోగి, యజమాని వాటాలు ఆ మొత్తంపై వడ్డీ కలుపగా వచ్చేది మొత్తం భవిష్యనిది నిల్వగా అవుతుంది. అందులో కనీస నిల్వ ఉంచి.. మిగతా మొత్తం నుంచి మాత్రమే విత్ డ్రా చేసుకునేందుకు అనుమతి ఉంటుంది.
అనారోగ్యం, విద్య, వివాహం, గృహ నిర్మాణం వంటి సందర్భాలలో రూ. 5 లక్షల వరకు క్లెయిమ్ల ఆటో-సెటిల్మెంట్ ప్రస్తుతం అందుబాటులో ఉంది. ఈ కొత్త ఫీచర్ను ప్రారంభించిన తర్వాత, 7.8 కోట్లకు పైగా క్రియాశీల సభ్యులు తమ పీఎఫ్ నిధులను యూపీఐ ద్వారా నేరుగా తమ బ్యాంకు ఖాతాలకు బదిలీ చేసుకోగలరని భావిస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.