
భారత్కు పొరుగున ఉన్న బంగ్లాదేశ్లో చైనా తన వ్యూహాత్మక ప్రభావాన్ని వేగంగా పెంచుకుంటోంది. గతంలో భారతదేశానికి కేటాయించిన మొంగ్లా రేవు సమీపంలోని కీలకమైన భూమిని చైనాకు బంగ్లాదేశ్ ప్రభుత్వం అప్పగించింది.
భారత్‌కు పొరుగున ఉన్న బంగ్లాదేశ్‌లో చైనా తన వ్యూహాత్మక ప్రభావాన్ని వేగంగా పెంచుకుంటోంది. గతంలో భారతదేశానికి కేటాయించిన మొంగ్లా రేవు సమీపంలోని కీలకమైన భూమిని చైనాకు బంగ్లాదేశ్ ప్రభుత్వం అప్పగించింది. అక్కడ ప్రత్యేక ఆర్థిక జోన్ ఏర్పాటు చేసేందుకు చైనా ప్రభుత్వ యాజమాన్య సంస్థతో బంగ్లాదేశ్ నూతన ప్రధానమంత్రి తారిఖ్ రెహమాన్ చైనా పర్యటనలో ఒక కీలక ఒప్పందంపై సంతకం చేశారు. దీని ద్వారా ఇరుదేశాల బంధం మరింత బలపడనుంది.మొంగ్లా పోర్టు పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాకు కేవలం 188 కిలోమీటర్ల దూరంలో ఉన్న మొంగ్లా నౌకాశ్రయం బంగ్లాదేశ్‌లో రెండో అతిపెద్ద పోర్ట్. బంగాళాఖాతంలో భారత్ నౌకాదళ ప్రాబల్యానికి అత్యంత సమీపంలో ఉన్న ఈ వ్యూహాత్మక ప్రాంతంలో చైనా అడుగుపెట్టడం న్యూఢిల్లీలో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. గతంలో షేక్ హసీనా హయాంలో ఈ 110 ఎకరాల భూమిలో భారత సంస్థ అయిన హీరానందని గ్రూప్ సెజ్ నిర్మించాల్సి ఉంది. భారత్-బంగ్లా మధ్య మరో చిచ్చు..! ప్రధాని సలహాదారు స్క్రీనింగ్-రాయబారికి సమన్లు..!భారత్ చేజారిన వైనంబంగ్లాదేశ్‌లో చోటుచేసుకున్న రాజకీయ సంక్షోభం తర్వాత ఏర్పడిన మహ్మద్ యూనస్ తాత్కాలిక ప్రభుత్వం భారత్‌కు కేటాయించిన ఈ ప్రాజెక్ట్‌ను రద్దు చేసింది. ఒప్పంద గడువులోగా పనులు ప్రారంభించలేదనే సాంకేతిక కారణాన్ని చూపి భారత డెవలపర్‌ను ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పించింది. దీనిని చక్కటి అవకాశంగా మలుచుకున్న చైనా, బంగ్లాదేశ్ కొత్త నాయకులను సంప్రదించి అత్యంత వేగంగా ఈ స్థలాన్ని దక్కించుకుంది.పెరగనున్న డ్రాగన్ నిఘా ఈ చైనా ప్రాజెక్ట్ ద్వారా బంగాళాఖాతంలో డ్రాగన్ నిఘా కార్యకలాపాలు పెరిగే ప్రమాదం ఉందని భారత రక్షణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే హిందూ మహాసముద్రంలో విస్తరణ కాంక్షతో ఉన్న చైనా, పాకిస్తాన్‌లోని గ్వాదర్ నుంచి ఆఫ్రికా తీరం వరకు పలు నౌకాశ్రయాలలో పెట్టుబడులు పెట్టింది. చైనాకు అవసరమైన ముడి చమురు రవాణాలో 80 శాతం ఈ సముద్ర మార్గం గుండానే సాగుతుండటంతో ఈ ప్రాంతంలో పట్టు సాధించాలని చైనా తీవ్రంగా ప్రయత్నిస్తోంది. బంగ్లాదేశ్ కు భారత్ గుడ్ న్యూస్..! పాక్, చైనా దూకుడుకు కళ్లెం.. !తీస్తా నది ప్రాజెక్టుపైనా ఆందోళనమొంగ్లా పోర్టుతో పాటు భారత్‌కు అత్యంత సున్నితమైన అంశమైన తీస్తా నది పరిరక్షణ పనులు మరియు నీటి నిర్వహణ ప్రాజెక్టులోనూ చైనాతో మరింత లోతైన సహకారానికి బంగ్లాదేశ్ సిద్ధమైంది. ఈ ప్రాంతం ఈశాన్య రాష్ట్రాలను భారతదేశంతో అనుసంధానించే అత్యంత కీలకమైన సిలిగురి కారిడార్ లేదా చికెన్స్ నెక్కు చాలా సమీపంలో ఉండటంతో రక్షణ పరంగా భారత్ తన పర్యవేక్షణను మరింత తీవ్రతరం చేయవలసిన అత్యవసర పరిస్థితి ఏర్పడింది. చైనా తమకు అతిపెద్ద వ్యాపార భాగస్వామి అయినప్పటికీ, భారత్‌తో ఉన్న సుదీర్ఘ సరిహద్దు భౌగోళిక వాస్తవికతను బంగ్లాదేశ్ పూర్తిగా విస్మరించలేదు. చైనాతో ఆర్థిక ప్రయోజనాలను పొందుతూనే, పక్కనే ఉన్న భారతదేశంతో దశాబ్దాల కాలంగా కొనసాగుతున్న చారిత్రక, వ్యూహాత్మక, సాంస్కృతిక సంబంధాలను బంగ్లాదేశ్ భవిష్యత్తులో ఎలా సమతుల్యం చేస్తుందో చూడాల్సి ఉంది.