
ఆంధ్రప్రదేశ్లోని విమానాశ్రయాల్లో మద్యం అమ్మకాలకు రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఎయిర్పోర్టుల ప్రాంగణాల్లో బార్లు, వైన్ షాపులు ఏర్పాటు చేసేందుకు అనుమతిస్తూ శనివారం అధికారికంగా ఉత్తర్వులు జారీ...
ఆంధ్రప్రదేశ్లోని విమానాశ్రయాల్లో మద్యం అమ్మకాలకు రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఎయిర్పోర్టుల ప్రాంగణాల్లో బార్లు, వైన్ షాపులు ఏర్పాటు చేసేందుకు అనుమతిస్తూ శనివారం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, ఆధ్యాత్మిక కేంద్రమైన తిరుపతిలోని విమానాశ్రయానికి ఈ ఉత్తర్వుల నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.ప్రభుత్వం జారీ చేసిన కొత్త మార్గదర్శకాల ప్రకారం, విమానాశ్రయాల్లోని బార్లు, వైన్ షాపులు 24 గంటలూ పనిచేసేందుకు అనుమతి కల్పించారు. ఈ కొత్త విధానంలో భాగంగా ప్రభుత్వం లైసెన్స్ ఫీజులు, ఎక్సైజ్ సుంకాన్ని కూడా ఖరారు చేసింది. ఎయిర్పోర్టులో బార్ లైసెన్స్ కోసం దరఖాస్తు ఫీజు రూ.5 లక్షలు, వైన్ షాపు కోసం దరఖాస్తు ఫీజు రూ.2 లక్షలుగా నిర్ణయించారు.ఇక ఎక్సైజ్ సుంకం విషయానికొస్తే, విమానాశ్రయంలోని వైన్ షాపుకు ఏటా రూ.2 కోట్లుగా నిర్ణయించారు. బార్లకు ప్రయాణికుల రద్దీ ఆధారంగా ఎక్సైజ్ సుంకాన్ని రెండు రకాలుగా విభజించారు. ఏడాదికి 20 లక్షలకు పైగా ప్రయాణికుల రాకపోకలు ఉన్న విమానాశ్రయాల్లోని బార్లకు రూ.25 లక్షలు, 20 లక్షల లోపు ప్రయాణికులు ఉన్నచోట రూ.15 లక్షలుగా ఎక్సైజ్ సుంకాన్ని నిర్ధారించారు. ఈ కొత్త ఎక్సైజ్ విధానాన్ని మూడేళ్ల తర్వాత సమీక్షించనున్నట్లు ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో పేర్కొంది.