
టీమిండియా యువ ఆల్రౌండర్, తెలుగు తేజం నితీశ్ కుమార్ రెడ్డి తన నానమ్మపై ఉన్న ప్రేమను ప్రత్యేకంగా చాటుకున్నాడు. నాలుగేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత తన సొంతూరైన విశాఖపట్నంలోని గాజువాకకు వెళ్లిన నితీశ్,...
టీమిండియా యువ ఆల్రౌండర్, తెలుగు తేజం నితీశ్ కుమార్ రెడ్డి తన నానమ్మపై ఉన్న ప్రేమను ప్రత్యేకంగా చాటుకున్నాడు. నాలుగేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత తన సొంతూరైన విశాఖపట్నంలోని గాజువాకకు వెళ్లిన నితీశ్, తన నానమ్మకు స్వయంగా బంగారు గాజులు తొడిగి ఆమె ఆశీర్వాదం తీసుకున్నాడు. నిన్న తన స్వగ్రామానికి చేరుకున్న నితీశ్ రెడ్డి రాకతో అక్కడ పండుగ వాతావరణం నెలకొంది.ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. "చాలా రోజుల తర్వాత సొంతూరికి రావడం ఎంతో సంతోషంగా ఉంది. నా బాల్యం మొత్తం ఇక్కడే గడిచింది. ఈ ప్రాంతంతో నాకు విడదీయరాని అనుబంధం ఉంది" అని తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నాడు. తాను ఈ స్థాయికి రావడానికి తన తల్లిదండ్రుల త్యాగాలే కారణమని నితీశ్ రెడ్డి తెలిపాడు. "చిన్నప్పటి నుంచి నా కలలను నమ్మి, నన్ను అన్ని విధాలుగా ప్రోత్సహించారు. వారి కష్టం వల్లే నాకు భారత జట్టులో చోటు దక్కింది. నేను దేశానికి ఆడాలని మా నానమ్మ ఎప్పుడూ కలలు కనేది" అని కుటుంబ సభ్యుల ప్రోత్సాహాన్ని వివరించాడు.భారత క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లీ తనకు ఆదర్శమని నితీశ్ కుమార్ రెడ్డి తెలిపాడు. కోహ్లీ ఆటతీరు, అంకితభావం తనను ఎంతగానో ప్రభావితం చేశాయని చెప్పాడు. భారత జట్టులో తన ప్రయాణం ఇప్పుడే మొదలైందని, జట్టులో స్థానం సుస్థిరం చేసుకొని దేశానికి మరిన్ని విజయాలు అందించడమే తన లక్ష్యమని స్పష్టం చేశాడు.ప్రస్తుతం నితీశ్ రెడ్డి తొడ కండరాల గాయంతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఆఫ్ఘనిస్థాన్తో జరిగిన వన్డే సిరీస్లో