
రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్, లైఫ్స్టైల్, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు.
గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.
Macherla Road Accident Today: నగరంలో వరుసగా జరుగుతున్న ప్రమాదాలు ప్రజల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ముఖ్యంగా రాత్రి వేళల్లో అతివేగం వల్ల ప్రమాదాలు జరిగి ప్రాణాలు కోల్పోవడం చూస్తుంటే కలత చెందుతున్నారు. ఈరోజు తెల్లవారుజామున ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లా మాచర్ల ప్రాంతంలో ఒక ఘోర ప్రమాదం జరిగింది. హైదరాబాద్కు చెందిన నలుగురు ఈ ప్రమాదంలో మరణించారు. హైదరాబాద్ నుంచి ఏపీలోని పామూరుకు బయలుదేరిన తుఫాన్ వాహనం, మాచర్లలో శ్రీశైలం హైవేపై ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో హైదరాబాద్కు చెందిన నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ క్రమంలో తుఫాన్ వాహనంలోని మరికొందరు ప్రాణాపాయ స్థితిలో గాయపడ్డారు. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా, ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను అత్యవసరంగా ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు వేగవంతం చేశారు. ప్రాణాలను కోల్పోయిన వారు తమ చనిపోయిన తమ బంధువు ఇంటికి వెళ్తున్న సమయంలోనే ఈ ఘోర ప్రమాదం జరగడం విషాదకరం. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.