
డైనోసార్లు భూమిపై సంచరించడానికి కోట్ల ఏళ్ల ముందే ఓ భారీ ఉల్క భూమిని ఢీకొట్టిందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఆ ఘటనకు సంబంధించిన అత్యంత పురాతన ఆధారాలను తాజాగా గుర్తించారు. ఈ ఉల్కాపాతం సుమారు
300 కోట్ల సంవత్సరాల క్రితం జరిగిందని నిర్ధారించారు. ఇప్పటివరకు ప్రపంచంలోని అత్యంత పురాతన ఉల్క బిలం ఇదేనని పరిశోధకులు చెబుతున్నారు.ఆస్ట్రేలియాలోని పశ్చిమ ప్రాంతం పిల్బారా పరిధిలో ఉన్న నార్త్ పోల్ డోమ్ ప్రాంతంలో ఈ పరిశోధన చేపట్టారు. ఈ ప్రాంతాన్ని చాలా కాలంగా పురాతన ఉల్కాపాత కేంద్రంగా భావిస్తున్నారు. అయితే అది ఎప్పుడు జరిగిందనే విషయంలో స్పష్టత లేదు. తాజాగా ఆధునిక ఖనిజ విశ్లేషణ పద్ధతులను ఉపయోగించిన శాస్త్రవేత్తలు ఆ సందేహాలకు తెరదించారు.పరిశోధకుల దృష్టిని ముఖ్యంగా జిర్కాన్ అనే సూక్ష్మ ఖనిజం ఆకర్షించింది. భూమి చరిత్రను కోట్లాది సంవత్సరాల పాటు భద్రపరిచే సామర్థ్యం ఈ ఖనిజానికి ఉంది. నార్త్ పోల్ డోమ్లో లభించిన కొన్ని జిర్కాన్ కణాల్లో అసాధారణ మార్పులను గుర్తించారు. భారీ ఉల్క ఢీకొట్టిన సమయంలో ఏర్పడిన తీవ్రమైన వేడి కారణంగా ఈ మార్పులు సంభవించాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.ఈ పరిశోధనకు నాయకత్వం వహించిన ప్రొఫెసర్ క్రిస్ కిర్క్లాండ్ ప్రకారం, జిర్కాన్లో నమోదైన సంకేతాలు సుమారు 300 కోట్ల ఏళ్ల క్రితం జరిగిన ఒకే ఘటనను సూచిస్తున్నాయి. దీన్ని మరింత కచ్చితంగా నిర్ధారించేందుకు అపటైట్ అనే మరో ఖనిజాన్ని కూడా పరిశీలించారు. ఆశ్చర్యకరంగా అది కూడా అదే కాలాన్ని సూచించింది. రెండు వేర్వేరు పద్ధతుల్లో ఒకే ఫలితం రావడంతో పరిశోధకులు తమ నిర్ధారణపై