
ఇయర్బడ్స్ పెట్టుకుంటే చుట్టూ ఏం జరుగుతుందో వినిపించకపోవడం చాలామందికి ఇబ్బందిగా ఉంటుంది. ముఖ్యంగా రోడ్డుపై నడుస్తున్నప్పుడు, జిమ్లో వ్యాయామం చేస్తున్నప్పుడు లేదా ఆఫీసులో పనిచేస్తున్నప్పుడు ఈ సమస్య...
ఇయర్బడ్స్ పెట్టుకుంటే చుట్టూ ఏం జరుగుతుందో వినిపించకపోవడం చాలామందికి ఇబ్బందిగా ఉంటుంది. ముఖ్యంగా రోడ్డుపై నడుస్తున్నప్పుడు, జిమ్లో వ్యాయామం చేస్తున్నప్పుడు లేదా ఆఫీసులో పనిచేస్తున్నప్పుడు ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. అలాంటి వారిని లక్ష్యంగా చేసుకుని బోట్ కొత్త ఓపెన్-ఇయర్ ఇయర్బడ్స్ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. తక్కువ ధరలో అందుబాటులోకి వచ్చిన ఈ డివైజ్ ఇప్పుడు టెక్ ప్రియుల దృష్టిని ఆకర్షిస్తోంది.భారతీయ ఆడియో బ్రాండ్ బోట్ కొత్తగా ఎయిర్డోప్స్ ప్రోక్లిప్ ఇయర్బడ్స్ను విడుదల చేసింది. వీటి ప్రారంభ ధర రూ.1,599గా నిర్ణయించింది. సాటిన్ వైట్, సిల్క్ గ్రే, వెల్వెట్ వైన్ రంగుల్లో ఇవి అందుబాటులో ఉన్నాయి. కంపెనీ వెబ్సైట్తో పాటు అమెజాన్, ఫ్లిప్కార్ట్లో విక్రయాలు ప్రారంభమయ్యాయి.ఈ ఇయర్బడ్స్లో ప్రధాన ఆకర్షణ ఓపెన్-ఇయర్ డిజైన్. సాధారణ ఇయర్బడ్స్లా చెవిలోపలికి వెళ్లకుండా చెవి బయట భాగానికే అమరేలా వీటిని రూపొందించారు. దీంతో పాటలు వింటూనే చుట్టూ ఉన్న శబ్దాలు కూడా వినిపిస్తాయి. ట్రాఫిక్లో ప్రయాణించే వారు, జాగింగ్ చేసే వారు, సైక్లింగ్ చేసే వారికి ఇది ఉపయోగకరంగా ఉంటుందని కంపెనీ చెబుతోంది.ఇందులో ఎయిర్ కండక్షన్ టెక్నాలజీని ఉపయోగించారు. 12 ఎంఎం డైనమిక్ డ్రైవర్లు ఉండటంతో మంచి ఆడియో అనుభూతి లభిస్తుందని కంపెనీ పేర్కొంది. బయటకు శబ్దం తక్కువగా వెళ్లేలా ప్రత్యేక ఫీచర్ను కూడా ఇచ్చింది. ఫోన్ కాల్స్ కోసం ఏఐ ఆధారిత నాయిస్ క్యాన్సిలేషన్ సదుపాయం అందుబాటులో ఉంది. బ్లూటూత్ 6.0 కనెక్టివిటీతో పాటు ఒకేసారి రెండు డివైజ్లకు కనెక్ట్ అయ్యే సదుపాయం కూడా ఉంది.కంపెనీ యాప్ ద్వారా సౌండ్ సెట్టింగ్స్,