
ఫుట్బాల్ ప్రపంచకప్లో మరోసారి మెస్సీ-రొనాల్డో చర్చ తెరపైకి వచ్చింది. అయితే ఈసారి గోల్స్ వల్ల కాదు. మ్యాచ్ తర్వాత మీడియా సమావేశంలో జరిగిన ఓ చిన్న ఘటన వల్ల.
మెస్సీ గురించి వరుసగా ప్రశ్నలు రావడంతో పోర్చుగల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో అసహనం వ్యక్తం చేశాడు. కొన్ని ప్రశ్నలను పూర్తిగా పట్టించుకోకుండా వదిలేయడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది.ఉజ్బెకిస్థాన్తో మంగళవారం జరిగిన మ్యాచ్లో పోర్చుగల్ చెలరేగింది. ప్రత్యర్థిపై 5-0తో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో రొనాల్డో రెండు గోల్స్ చేసి జట్టు విజయానికి బాటలు వేశాడు. తొలి మ్యాచ్లో గోల్ చేయలేకపోయిన అతడు ఈసారి తన మార్క్ చూపించాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడేందుకు వచ్చిన రొనాల్డోను ఎక్కువగా మెస్సీ గురించే ప్రశ్నలు చుట్టుముట్టాయి.ఓ విలేకరి మెస్సీ ప్రదర్శన గురించి ప్రశ్న అడగడం ప్రారంభించగానే రొనాల్డో వెంటనే మరోవైపు తిరిగాడు. ఆ ప్రశ్నను కొనసాగించనివ్వకుండా మరో రిపోర్టర్ను మాట్లాడమన్నాడు. దీంతో అక్కడ ఉన్నవారంతా ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.అంతటితో ఆగలేదు. అర్జెంటీనాతో తర్వాతి దశలో మ్యాచ్ జరిగితే ఎలా ఉంటుందన్న ప్రశ్న కూడా రొనాల్డోకు ఎదురైంది. దీనిపై స్పందించిన అతడు, ‘‘ఇప్పుడే అలాంటి విషయాలు చెప్పడం కష్టం. కానీ ఆ మ్యాచ్ జరిగితే అభిమానులకు మంచి వినోదం దొరుకుతుంది’’ అని పేర్కొన్నాడు. అయితే మెస్సీ పేరును పదేపదే ప్రస్తావించడంపై మాత్రం ఆసక్తి చూపలేదు.మరోవైపు ఈ ప్రపంచకప్లో మెస్సీ అద్భుత ఫామ్లో ఉన్నాడు. రెండు మ్యాచ్ల్లోనే ఐదు