
Kamakhya Devevi temple ambubachaimela: మూడు రోజుల పాటు కామాఖ్య అమ్మవారి ఆలయంను మూసి ఉంచుతారు. ఆతర్వాత నాలుగో రోజున ప్రత్యేకంగా పూజలు చేసి మరీ ఆలయాన్ని తెరుస్తారు.
ఆ సమయంలో అమ్మవారిని ఆరాధిస్తే విశేషమైన శక్తులు లభిస్తాయని తాంత్రికులు నమ్ముతారు.
మన దేశంలో అష్టాదశ శక్తి పీఠాలు ఉన్నాయి. దీనివెనకాల ఉన్న స్టోరీ విషయంకు వస్తే.. శివుని భార్య అయిన సతీదేవీని దక్ష ప్రజాపతి చేసిన అవమానానికి ఆత్మార్పణ చేసుకుంటుంది.ఆ తర్వాత శివుడు తన జటాజుటం నుంచి వీరభద్రుడ్ని సృష్టించి దక్ష ప్రజాపతిని వధించాలని ఆదేశిస్తారు. ఆతర్వాత సతీదేవిని తన భుజాల మీద వేసుకుని శివుడు తాండం చేస్తాడు. ఆ సమయంలో సతీదేవి శరీర భాగాలు పలుప్రదేశాల్లో పడతాయి.ఆ ప్రదేశాలు శక్తిపీఠాలుగా ఉద్బవించాయి.
అస్సాంలోని గువహతిలోని నీలాంచల్ పర్వతాల్లో సతీదేవి యోని భాగం పడటంతో అక్కడ యోనీ రూపంలో అమ్మవారిని కొలుచుకుంటారు. ఇక్కడి అమ్మవారిని కామాఖ్యదేవిగా పిలుస్తారు. ప్రతి ఏడాది అమ్మవారికి మూడు రోజుల పాటు రుతుక్రమం జరుగుతుందని చెబుతారు.ఈ మూడు రోజుల పాటు కామాఖ్య అమ్మవారి ఆలయంను మూసి వేచి ఉంచుతారు. నాలుగో రోజున ప్రత్యేకంగా పూజలు చేసి కామాఖ్య అమ్మవారిని భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తారు.
ఈ సారి కూడా జూన్ 22 నుంచి 26 వరకు అమ్మవారికి రుతు క్రమం ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. దీన్ని అంబు బాచీ మేళగా పిలుస్తారు. దీన్ని ఒక కుంభమేళగా నిర్వహిస్తారు. దేశం నలుమూలల నుంచి సాధులు, అఘోరాలు, తాంత్రిక సాధనలు చేసే వారు భారీగా కామాఖ్య అమ్మవారి ఆలయంకు తరలి వస్తారు.
లక్షలాదిగా భక్తులు తరలి వచ్చి కామాఖ్య అమ్మవారి నాలుగో రోజు దర్శనం కోసం ఎదురు చూస్తారు. ఇప్పటికే జూన్ 22న రాత్రి పూజలు చేసి అమ్మవారి యోనీ భాగంలో తెల్లని వస్త్రంను కప్పి ఉంచి ఆలయం మూసి వేశారు.
నాలుగో రోజు అంటే జూన్ 26న మరల ద్వారాలు తెరచి ప్రత్యేకంగా పూజలు చేస్తారు. ఎలా అయితే అమ్మాయిల్లో రుతుక్రమం జరిగినప్పుడు రక్తం బ్లీడింగ్ అవుతుందో అచ్చం అలానే అమ్మవారికి రుతు క్రమం జరుగుతుందని చెప్తారు. ఈ సమయంలో స్థానికంగా ఉన్న బ్రహ్మపుత్ర నది కూడా ఎరుపురంగులో ప్రవహిస్తుందని భక్తులు ప్రగాఢంగా నమ్ముతారు.
అంబుబాచీ ఉత్సవంను కుంభమేళ ఆఫ్ ది ఈస్ట్ అని పిలుస్తారు. నాలుగో రోజున ఆలయం తెరిచాక అమ్మవారిని దర్శించుకుంటే విశేషమైన శక్తులు, తాంత్రిక సిద్దిప్రాప్తిస్తుందని సాధులు, అఘోరాలు, అఘోరీలు నమ్ముతారు. అందుకే భారీగా అడవులు, హిమాలయాల నుంచి బైటకు వచ్చి కామాఖ్య అమ్మవారి దర్శనం కోసం ఎదురు చూస్తుంటారు.
జూన్ 26వ తేదీన అమ్మవారి యోని భాగంలో ఉంచిన పెద్ద వస్త్రం పూర్తిగా ఎరుపురంగులో మారిపోయి ఉంటుంది. దీన్ని భక్తులకు ప్రసాదంగా అందజేస్తారు. ఈ ప్రసాదం వస్త్రం పదార్థం ఎక్కడైతే ఉంటుందో అక్కడ నెగెటివ్ ఎనర్జీ ఉండదని, ఇంట్లో సిరి సంపదలకు లోటు ఉండదని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు. అందుకే అంబుబాచిమేళాకు వచ్చేందుకు చాలా మంది భక్తులు ఆసక్తి చూపిస్తారు. ఏడాదిలో ఒక్కసారిగా జరిగే ఈ మేళను చూసేందుకు రెండు కళ్లు సరిపొవని చెప్పుకొవచ్చు.