
తెలుగు రాష్ట్రాల్లో సాగుతున్న ప్రత్యేక ఓటర్ల జాబితాల సవరణ (SIR) ప్రక్రియలో బీఎల్వోలు కీలకంగా మారారు. అయితే వారిపై ఉన్న పని ఒత్తిడి నేపథ్యంలో ఇంకా చాలా మంది
ఓటర్లకు ఎస్ఐఆర్ ఫారం కూడా అందలేదనే ఫిర్యాదులు వస్తున్నాయి. అలాగే ఎస్ఐఆర్ ఫారం ఇచ్చినా వాటిని పూర్తి చేశాక తిరిగి తీసుకోవడంలో ఆలస్యం చేస్తున్నారనే ఫిర్యాదులు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో రెండు పాయింట్లు కరెక్ట్ గా ఉంటే చాలు మీ ఎస్ఐఆర్ ఫారం ఆన్ లైన్ లో ఎలా సులువుగా పూర్తి చేసి సబ్మిట్ చేసుకోవచ్చో ఇక్కడ చూద్దాం...
ఎస్ఐఆర్ ఫారం ఆన్ లైన్ లో సమర్పించాలంటే రెండు అంశాలు తప్పనిసరి. ఇందులో ఒకటి ఓటర్ కార్డుకు మొబైల్ నంబర్ లింక్ అయి ఉండాలి. రెండవది ఓటరు కార్డులోని పేరు ఆధార్ కార్డులోని అక్షరాలతో ఖచ్చితంగా సరిపోలాలి. ఏమాత్రం సరిపోలకపోయినా ఇ-సైన్ ప్రక్రియ విఫలమవుతుంది.ఇది సరిపోలని పక్షంలో మాత్రం ఓటరు బీఎల్వో ద్వారా భౌతిక ఫారమ్ను సమర్పించాల్సి ఉంటుంది. ఈ రెండు అంశాలు సరిగ్గా ఉంటే మాత్రం ఆన్ లైన్ లో ఫారం ఎలా సమర్పించాలో ఇక్కడ చూద్దాం..
1. పోర్టల్ను యాక్సెస్ చేసి, లాగిన్ కావాలి
ECI ఓటర్ సర్వీస్ పోర్టల్ ను ఓపెన్ చేయాలి. లేదా ECINET మొబైల్ యాప్ను ఓపెన్ చేయాలి. ఇందులో ఓటర్లు తాము ఇప్పటికే ఈ వెబ్ సైట్ లేదా యాప్ లో నమోదు చేసుకున్న వివరాలతో లాగిన్ కావాలి. లేదా కొత్త యూజర్ గా సైనప్ చేసుకుని లాగిన్ కావచ్చు.
2. ఎన్యూమరేషన్ ఫారమ్ను నింపడం. యూజర్ డాష్బోర్డ్లో "ఎన్యూమరేషన్ ఫారమ్ నింపండి" బటన్పై క్లిక్ చేయాలి. ప్రాంతీయ డేటాబేస్ను పొందడానికి డ్రాప్డౌన్ మెనూ నుండి రాష్ట్రాన్ని ఎంచుకోవాలి.
3. ఎపిక్ నంబర్ ను ఇందులో ఎంటర్ చేయాలి. తర్వాత సెర్చ్ బటన్పై క్లిక్ చేస్తే పోర్టల్ లైవ్ డేటాబేస్ నుండి ప్రస్తుత ఓటర్ల డేటాను తీసుకుంటుంది. పాక్షికంగా ముందుగా నింపిన ఎన్యూమరేషన్ ఫారమ్ డ్రాఫ్ట్ స్క్రీన్పై కనిపిస్తుంది.
4. మొబైల్ OTP ధృవీకరణను పూర్తి చేయాలి. ఇందుకోసం ముందుగా "ఎంటర్ OTP" బటన్పై క్లిక్ చేయాలి. EPICతో నమోదు చేసుకున్న మొబైల్ నంబర్కు OTP వస్తుంది. అప్పుడు అక్కడ ఉన్న ఫీల్డ్లో OTPని నమోదు చేయాలి ఇది ఫారమ్లోని మిగిలిన భాగాన్ని అన్లాక్ చేస్తుంది.
6. అదనపు/బంధువుల వివరాలను అందించాలి. ఐదో ఆప్షన్ లో ఎంపిక ఆధారంగా నిర్దిష్ట టెక్స్ట్ ఫీల్డ్లను పూరించాలి. ఓటరు పేరు పాత జాబితాలో లేకపోయి, కుటుంబ సభ్యుని పేరు ఉంటే బంధువు పేరును నమోదు చేయాలి. సంబంధం రకం, పాత నియోజకవర్గం/పార్ట్ నంబర్ వివరాలు నమోదు చేయాలి. అలాగే పుట్టిన తేదీని అప్డేట్ చేసుకోవచ్చు. అలాగే తాజా పాస్పోర్ట్ ఫోటోను అప్లోడ్ చేయాలి.
7. ఆధార్ ఇ-సైన్ ప్రక్రియ పూర్తి చేయాలి. ఫారమ్లోని అక్షరదోషాలను సమీక్షించడానికి ప్రివ్యూ బటన్పై క్లిక్ చేయాలి. సరిగ్గా ఉంటే, డిక్లరేషన్ చెక్బాక్స్ను టిక్ చేయాలి. అనంతరం సమర్పించు (Submit) పై క్లిక్ చేయాలి. పోర్టల్ ఆధార్ ఇ-సైన్ గేట్వేకి మళ్లిస్తుంది. అక్కడ ఆధార్ నంబర్ను నమోదు చేయాలి. ఆధార్తో అనుసంధానించబడిన మొబైల్ ఓటీపీ ద్వారా ధృవీకరించాలి. దీంతో డిజిటల్ సంతకం జోడించబడుతుంది. దీంతో ఆన్లైన్ సమర్పణ పూర్తయినట్లే. ఆ తర్వాత పని ఎన్నికల అధికారులు చూసుకుంటారు.