
టీ20 ప్రపంచకప్ విజయం తర్వాత భారత క్రికెట్ జట్టు మరో సుదీర్ఘ పర్యటనకు సిద్ధమైంది. శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని యువభారత్..
ఐర్లాండ్, ఇంగ్లండ్తో పరిమిత ఓవర్ల సిరీస్లు ఆడేందుకు చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయల్దేరి వెళ్లింది. ఈ పర్యటన ఈ నెల 26 నుంచి ప్రారంభం కానుంది. ఈ టూర్లో భాగంగా భారత్ రెండు టీ20లు, ఎనిమిది వన్డేలు ఆడనుంది.ఈ పర్యటనలో భాగంగా తొలుత ఐర్లాండ్తో డబ్లిన్లో జూన్ 26, 28 తేదీల్లో రెండు టీ20 మ్యాచ్లు ఆడుతుంది. టీ20 ప్రపంచకప్ గెలిచిన తర్వాత భారత్ ఆడుతున్న తొలి టీ20 సిరీస్ ఇదే కావడం విశేషం. 2028లో జరగనున్న లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్, ఆస్ట్రేలియా-న్యూజిలాండ్లో జరిగే తదుపరి టీ20 ప్రపంచకప్ను దృష్టిలో ఉంచుకుని, పొట్టి ఫార్మాట్లో ఇది భారత జట్టుకు ఒక కొత్త అధ్యాయంగా భావిస్తున్నారు.ఈ పర్యటనలో ప్రధాన ఆకర్షణగా 15 ఏళ్ల 71 రోజుల వయసున్న యువ బ్యాటింగ్ సంచలనం వైభవ్ సూర్యవంశీ నిలిచాడు. తద్వారా 36 ఏళ్ల క్రితం సచిన్ టెండూల్కర్ నెలకొల్పిన రికార్డును బద్దలు కొట్టి, భారత పురుషుల క్రికెట్ జట్టుకు ఎంపికైన అత్యంత పిన్న వయస్కుడిగా చరిత్ర సృష్టించాడు. అతనితో పాటు ఐపీఎల్లో అద్భుత ప్రదర్శన చేసిన అన్క్యాప్డ్ ఫాస్ట్ బౌలర్ ప్రిన్స్ యాదవ్ కూడా తొలిసారిగా సీనియర్ టీ20 జట్టులో చోటు దక్కించుకున్నాడు.సీనియర్ పేసర్ మహమ్మద్ సిరాజ్ను మొదట జట్టులోకి ఎంపిక చేసినప్పటికీ, అతని స్థానంలో ప్రసిధ్ కృష్ణను తీసుకున్నారు. అలాగే, గాయం నుంచి కోలుకున్న సీమ్-బౌలింగ్ ఆల్రౌండర్