
Q Mitra App For Ticket Booking: రైల్వే ప్రయాణికులకు ఒక శుభవార్త! ఇకపై తత్కాల్ టికెట్ల కోసం గంటల తరబడి క్యూలో నిలబడాల్సిన అవసరం ఉండదు.
ప్రయాణికులకు సురక్షితంగా , సులభమంగా ఉండేలా రైల్వే శాఖ ఇప్పుడు 'క్యూమిత్ర' యాప్ను టెస్ట్ చేస్తోంది. త్వరలోనే ఈ సౌకర్యాన్ని టికెట్ కౌంటర్లలో కూడా అందుబాటులోకి తీసుకువస్తారు.. దీనివల్ల ప్రయాణికులు ఎక్కువ సేపు వెయిట్ చేయాల్సిన పనిలేదు. దీనివల్ల కలిగే లాభాలేంటో ఒకసారి చూద్దాం.
సాధారణంగా రైల్వే ప్రయాణికులు IRCTC లేదా థర్డ్ పార్టీ యాప్స్ ద్వారా టికెట్లు బుక్ చేసుకుంటారు. అలాగే రైల్వే కౌంటర్లకు కూడా వెళ్తుంటారు. కానీ కౌంటర్ల దగ్గర భారీగా క్యూ ఉండటం వల్ల చాలా సమయం వృథా అవుతుంది. ప్రయాణికుల ప్రయాణాన్ని మరింత ఈజీగా, సేఫ్ గా మార్చడానికి ఇండియన్ రైల్వేస్ ఈ క్యూమిత్ర యాప్ను తీసుకురాబోతోంది.
ప్రస్తుతం ఇది ట్రయల్ స్టేజ్లో ఉంది. ఇది అందుబాటులోకి వస్తే, ప్రయాణికులు ఎక్కడి నుండైనా మొబైల్ ద్వారా సులభంగా టికెట్ బుక్ చేసుకోవచ్చు, ఇది QR కోడ్ రూపంలో ఉంటుంది. ముఖ్యంగా చెప్పాలంటే, గతంలో ఆన్లైన్ తత్కాల్ బుకింగ్స్ కోసం OTP వెరిఫికేషన్ ఉండేది. దానివల్ల మోసపూరిత బుకింగ్స్ తగ్గాయి.
ఇప్పుడు కూడా గుర్తింపు ప్రక్రియ కొనసాగుతోంది. దళారుల ఐడీలను రైల్వే శాఖ తొలగిస్తోంది. టికెట్ బుక్ చేసుకున్న తర్వాత ప్రయాణికులు కేవలం టికెట్ తీసుకోవడానికి బుకింగ్ కౌంటర్ వద్దకు వెళ్తే సరిపోతుంది. దీనివల్ల కౌంటర్ల దగ్గర రద్దీ తగ్గుతుంది. టికెట్ ప్రాసెస్ కూడా చాలా ఈజీ అవుతుంది.
రైల్వే ప్రయాణికులు అనవసరంగా ఎక్కువ సమయం కేటాయించాల్సిన అవసరం ఉండదు. ఈ క్యూమిత్ర యాప్లో ఆధార్ వెరిఫికేషన్, మొబైల్ నంబర్, ఫేస్ రికగ్నిషన్ కూడా తప్పనిసరి చేశారు. దీనివల్ల బ్లాక్ మార్కెట్ , టికెట్ల రీబుకింగ్ వంటి అరాచకాలు తగ్గుతాయి.
ప్రయాణికులు కేవలం నిర్ణీత సమయంలో టోకెన్ బుక్ చేసుకుంటే సరిపోతుంది, స్టేషన్లో క్యూలో నిలబడాల్సిన అవసరం లేదు. కౌంటర్ల వద్ద రద్దీ తగ్గించడమే కాకుండా, ఈ యాప్ ద్వారా దళారుల ఆటలు కూడా తగ్గుతాయి. ప్రస్తుతం ఇది ట్రయల్ దశలో ఉంది, ఒకవేళ ఇది సక్సెస్ అయితే ఫీడ్బ్యాక్ ఆధారంగా దీనిని మరింత విస్తరిస్తారు.