అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ముంబైలో ఎంతో ఘనంగా జరిగాయి. ఈ ప్రత్యేక కార్యక్రమంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సతీమణి అమృత ఫడ్నవీస్ , బాలీవుడ్ స్టార్ షాహిద్ కపూర్, టాలీవుడ్ సెన్సేషన్...
అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ముంబైలో ఎంతో ఘనంగా జరిగాయి. ఈ ప్రత్యేక కార్యక్రమంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సతీమణి అమృత ఫడ్నవీస్ , బాలీవుడ్ స్టార్ షాహిద్ కపూర్, టాలీవుడ్ సెన్సేషన్ శ్రీలీల తదితరులు పాల్గొని ఉత్సాహంగా యోగాసనాలు వేశారు. శారీరక, మానసిక దృఢత్వానికి యోగా ఎంత అవసరమో చెప్తూ అమృత ఫడ్నవీస్ అందరికీ పిలుపునిచ్చారు. అంతవరకు బాగానే ఉన్నా, ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత జరిగిన ఒక సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపుతోంది. స్టార్ హీరోయిన్ శ్రీలీలను అమృత ఫడ్నవీస్ అవమానించారంటూ నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా మండిపడుతున్నారు.అసలేం జరిగిందంటే..?యోగా వేడుకల అనంతరం అమృత ఫడ్నవీస్, ఆమె కుమార్తె, శ్రీలీల కలిసి మీడియా ప్రతినిధులకు గ్రూప్ ఫొటోల కోసం ఫోజులిచ్చారు. అయితే ఆ సమయంలో అక్కడున్న జర్నలిస్టులు కొందరు కేవలం అమృత ఫడ్నవీస్, ఆమె కుమార్తె ఫొటోలు మాత్రమే కావాలని కోరారు. దాంతో ఆమె స్పందించిన తీరు వివాదాస్పదంగా మారింది. పక్కనే ఉన్న స్టార్ హీరోయిన్ శ్రీలీలకు మర్యాదగా చెప్పకుండా, చేతి వేళ్లతో సైగ చేస్తూ పక్కకు తప్పుకోవాలంటూ ఆమె చేసిన సంకేతం నెట్టింట హాట్ టాపిక్గా మారింది. అమృత ప్రవర్తనకు ఒక్కసారిగా షాకైన శ్రీలీల ఎలా రియాక్ట్ కావాలో తెలియక బేల చూపులు చూస్తూ కాస్త దూరంగా నిలబడిపోయింది. ఒక అగ్ర కథానాయిక పట్ల అమృత ప్రవర్తించిన తీరు సరిగ్గా లేదని, అలా వేళ్లతో సైగ చేస్తూ పక్కకు వెళ్లమనడం కరెక్ట్ కాదని, అది శ్రీలీలను అవమానించడమేనని నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. క్రేజీ స్టార్గా శ్రీలీల ప్రస్థానం ఈ వివాదం పక్కన పెడితే, ప్రస్తుతం సినీ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా శ్రీలీల దూసుకుపోతోంది. 2019లో కన్నడ చిత్రం 'కిస్' ద్వారా వెండితెరకు పరిచయమై తొలి చిత్రానికే 'సైమా' బెస్ట్ డెబ్యూ అవార్డు అందుకున్న ఈ బ్యూటీ, 2021లో 'పెళ్లి సందడి' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కనెక్ట్ అయిపోయింది. ఆ తర్వాత మాస్ మహారాజా రవితేజ సరసన చేసిన 'ధమాకా' చిత్రంతో కెరీర్లోనే బిగ్గెస్ట్ సక్సెస్ అందుకొని స్టార్ స్టేటస్ సొంతం చేసుకుంది. నందమూరి బాలకృష్ణతో 'భగవంత్ కేసరి', సూపర్ స్టార్ మహేష్ బాబుతో 'గుంటూరు కారం', అలాగే రామ్తో 'స్కంద' వంటి భారీ చిత్రాల్లో నటించి మెప్పించింది. 'పుష్ప 2: ది రూల్' చిత్రంలో స్పెషల్ సాంగ్లో తన అదిరిపోయే స్టెప్పులతో దేశవ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకుంది. శివకార్తికేయన్ సరసన ‘పరాశక్తి’తో కోలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం ధనుష్ సరసన క్రేజీ ఛాన్స్ కొట్టేసింది. బాలీవుడ్లో 'ఆషికి 3'తో ఎంట్రీ ఇస్తోంది. ప్రారంభంలో కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితమైన శ్రీలీల, ఇప్పుడు నటనకు ప్రాధాన్యమున్న వైవిధ్యమైన పాత్రలను ఎంచుకుంటూ కెరీర్లో దూసుకుపోతోంది. ఇంతటి క్రేజ్ ఉన్న స్టార్ హీరోయిన్కు ముంబై వేడుకల్లో ఇలాంటి చేదు అనుభవం ఎదురుకావడంపై టాలీవుడ్ అభిమానులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.