
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారిత ఇమేజ్ జనరేషన్ టూల్స్తో అంతర్జాతీయ ఖ్యాతి గడించిన 'మిడ్జర్నీ' సంస్థ, వైద్యరంగంలోకి సంచలన రీతిలో ప్రవేశించింది. కేవలం 60 సెకన్ల వ్యవధిలో పూర్తి శరీరాన్ని స్కాన్ చేసి, అంతర్గత అవయవాల చిత్రాలను అత్యంత స్పష్టంగా అందించే వినూత్న 'ఫుల్ బాడీ అల్ట్రాసౌండ్ స్కానర్'ను అభివృద్ధి చేస్తున్నట్లు ప్రకటించింది.
ఈ ప్రాజెక్టు కోసం ప్రత్యేకంగా 'మిడ్జర్నీ మెడికల్' అనే విభాగాన్ని సైతం ఆ సంస్థ ప్రారంభించింది.'అల్ట్రాసోనిక్ సీటీ' లేదా 'మిడ్జర్నీ స్కానర్'గా పిలిచే ఈ పరికరాన్ని వినియోగించే విధానం చాలా వైవిధ్యంగా ఉంటుంది. ఒక స్పా తరహా వాతావరణంలో, నీటితో నిండిన చిన్న కొలనులో వ్యక్తిని ఉంచి ఈ స్కానింగ్ నిర్వహిస్తారు.
ఆ కొలను చుట్టూ అమర్చిన లక్షలాది సూక్ష్మ అల్ట్రాసౌండ్ సెన్సర్లు పంపే శబ్ద తరంగాలు.. శరీరంలోని కండరాలు, అవయవాలు, ఎముకల 3D మ్యాప్ను సిద్ధం చేస్తాయి. ఎంఆర్ఐ లేదా సీటీ స్కాన్ల తరహాలో రేడియేషన్ లేదా శక్తివంతమైన అయస్కాంత క్షేత్రాల అవసరం లేకుండానే ఈ పరికరం పనిచేయడం విశేషం.భవిష్యత్తులో ఆరోగ్య పరీక్షలను మరింత సరళతరం చేయడమే తమ లక్ష్యమని మిడ్ జర్నీ వ్యవస్థాపకుడు, సీఈఓ డేవిడ్ హోల్జ్ పేర్కొన్నారు.
ఈ స్కానర్ ద్వారా లభించే చిత్రాలు ఎంఆర్ఐ ఫలితాలతో సమానమైన స్పష్టతను కలిగి ఉంటాయని, పైగా వంద రెట్లు వేగంగా ఫలితాలను అందిస్తాయని ఆయన వివరించారు. ప్రాథమిక దశలో ఈ స్కానర్లను వెల్నెస్, బాడీ కంపోజిషన్ మ్యాపింగ్ కోసం వినియోగించనున్నారు.
2027 నాటికి శాన్ ఫ్రాన్సిస్కోలో తొలి 'మిడ్జర్నీ స్పా'ను