
పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Hyderabad civil court issued gag orders on allu arjun pushpa 2 movie controversy: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు నాంపల్లి హైకోర్టు ఊహించని షాక్ ఇచ్చింది. గతంలో పుష్ప 2 మూవీ ప్రీరిలీజ్ వేళ అశోక్ నగర్ లోని సంధ్య థియేటర్ వద్ద చోటు చేసుకున్న తొక్కిసలాట ఘటనలో తమ ఎదుట హజరు కావాలని సమన్లు జారీ చేసింది.
2024 డిసెంబర్ 4న 'పుష్ప 2' సినిమా బెనిఫిట్ షో నేపథ్యంలో సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాటలో రేవతి అనే మహిళఅభిమాని చనిపోగా, ఆమె కుమారుడు శ్రీతేజ్ ఇప్పటికి చికిత్స తీసుకుంటున్నాడు. ఈ క్రమంలో పోలీసులు మొత్తంగా 23 మందిపై గతంలో చార్జ్ షీట్ దాఖలు చేశారు.
తాజాగా.. ఈ కేసులో నాంపల్లి కోర్టు తమ ఎదుట హజరు కావాలని 19 మందికి సమన్లు జారీ చేసింది. దీనిలో ఏ 11గా ఉన్న అల్లు అర్లును కూడా నాంపల్లి కోర్టు సమన్లు జారీ చేసింది. ఈ నెల 22న (సోమవారం) వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలని ఆదేశించింది.
దీంతో ఈ పరిణామం అల్లుఅర్జున్ కు బిగ్ షాక్ గా మారింది. మరోవైపు హైదరాబాద్ సిటి సివిల్ కోర్టు పుష్ప 2 వివాదంకు సంబంధించి గ్యాగ్ ఆర్డర్ విధించింది. పుష్ప 2 సినిమా చిత్ర యూనిట్ తో పాటు ఎవరిపై కూడా ఊహాజనిత వార్తలు వేయవద్దంటూ కోర్టు ఆదేశించింది.
ఊహాజనిత వార్త కథనాలతో పాటు, టీవీ ఛానెల్స్ లలో డిబేట్లు పెట్టవద్దంటూ కోర్టు స్పష్టం చేసింది. సంధ్య థియేటర్కు
సంబంధించిన O.S. No.216 of 2026 లో I.A. No.369 of 2026 కేసులో, హైదరాబాద్ నగర సివిల్ కోర్టు గౌరవ వేకేషన్ సివిల్ జడ్జి-కమ్-XXV అదనపు చీఫ్ జడ్జి గారు 04 జూన్ 2026 తేదీన మధ్యంతర (Ad-Interim Ex Parte Injunction) ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ ఉత్తర్వుల ప్రకారం, పై కేసుకు సంబంధించిన అంశాలపై కేసు విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో.. వాస్తవ నిర్ధారణకు ముందుగానే ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా ఎటువంటి ఊహాగానాలు, అసత్య ప్రచారాలు, ఆధారరహిత ఆరోపణలు, వాస్తవాలకు విరుద్ధమైన చర్చలు, డిబేట్లు, వార్తా కథనాలు లేదా సోషల్ మీడియా పోస్టులు ప్రచురించడం లేదా ప్రసారం చేయరాదని కోర్టు ఆదేశించింది.
Read more: Allu Arjun Stampede Case: తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్కు నాంపల్లి కోర్టు నోటీసులు..కోర్టులో హాజరు కావాల్సిందేనంటూ ఆదేశం!
ముఖ్యంగా.. సంబంధిత మీడియా సంస్థలు, డిజిటల్ ప్లాట్ఫారమ్లు, సోషల్ మీడియా వేదికలు, ప్రజలు గౌరవ న్యాయస్థానం జారీ చేసిన ఈ ఉత్తర్వులను గౌరవించి, కేసుకు సంబంధించిన నిర్ధారణ కాని సమాచారాన్ని ప్రచారం చేయకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోర్టు ఆదేశించింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.