చిట్టి జాతకాన్ని చూసి శని ప్రభావం తగ్గిపోతోంది.. త్వరలోనే చిట్టి ఇంటికి వస్తుందని స్వామిజీ అంటాడు. చిట్టి మహజ్జాతకురాలు అని స్వామిజీ అంటాడు. అందుకేనా అందరూ ఉన్నా అనాథలా ఎక్కడో పెరుగుతోందని దమయంతి కౌంటర్లు వేస్తుంది. ఎంత మహజ్జాతకమైనా చిన్న చిన్న దోషాలుంటాయి..
అవి తప్పవు.. ఆ దశ చిట్టికి దాటబోతోంది.. త్వరలోనే మీ దగ్గరకు వస్తుంది.. చిట్టిని మీరు ఎంత వెతికినా దొరకదు.. మీ చుట్టూనే చిట్టి తిరుగుతోంది.. మీరే తన వాళ్లు అని నిజం ఇంకా తెలియదు.. అది ఏదో ఒక రోజు తెలుస్తుంది.. ఆ నిజం తెలిసిన రోజున చిట్టి మీ ఇంటికి వస్తుంది..
అని స్వామిజీ అంటాడు. ఆ మాటకు రామచంద్ర, విక్రమ్ తెగ సంతోషిస్తుంటారు.నాకు మాత్రం ఇలాంటి స్వామిజీ మాటల్ని నమ్మాలని అనిపించడం లేదు అని దమయంతి అంటుంది. నువ్వు నమ్మొద్దు.. మేం నమ్ముతాం.. త్వరలోనే చిట్టి వస్తుంది.. మా అన్నని నాన్నా అని, మా అమ్మని నానమ్మ అని, నన్ను అత్తయ్య అని పిలుస్తుంది..
నిన్ను చిన్నమ్మ అని పిలుస్తుంది.. అప్పుడు నమ్ము అని సునంద కౌంటర్లు వేస్తుంది. మరో వైపు గాల్లో తేలుతూ డ్యాన్సులు చేస్తుంటాడు విక్రమ్. నన్ను సాయంత్రం బయటకు తీసుకు వెళ్లండి.. సర్ ప్రైజ్ అని అంటుంది రాధ. చిట్టి ధ్యాసలో ఉన్న విక్రమ్..
సరే తీసుకు వెళ్తాలే అని అంటాడు. ఇంకో వైపు స్వామిజీ మాటల్ని తల్చుకుంటూ ఉంటాడు రామచంద్ర.ఏంటి బావ గారు.. చిట్టి వస్తుందని అనుకుంటున్నారా.. ఇలాంటి స్వామిజీలా మాటలు నమ్మకండి.. అని దమయంతి అంటుంది. నేను చిట్టి గురించి కాదు.. దస్తగిరి గురించి ఆలోచిస్తున్నా అని రామచంద్ర అనడంతో దమయంతి భయపడిపోతుంది.
వాడు కళ్లు తెరిచి అసలు నిజం చెప్పిన రోజు.. వాళ్లని ఎక్కడున్నా పట్టుకుంటా.. ముక్కలు ముక్కలుగా నరికేస్తా అని అంటాడు. దీంతో దమయంతికి భయంతో చెమటలు కారుతుంటాయి. నీకు చెమటలు ఎందుకు కారుతున్నాయి.. వాళ్లతో
నీకు ఏమైనా సంబంధం ఉందా? అని రామచంద్ర అడుగుతాడు. నాకు ఎందుకు ఉంటుంది బావ గారు.. వాళ్లని చంపేస్తా అంటున్నారు.. మీరు ఎందుకు హంతకులు కావడం అని దమయంతి కవర్ చేస్తూ అక్కడి నుంచి వెళ్తుంది.🔹‘బ్రహ్మముడి’ టుడే ఎపిసోడ్ : సీతారామయ్య ఫోటోకి దండం పెట్టిన రేఖ.. రాజు అసాధ్యుడే.. బట్టబయలు చేసేందుకు సిద్దమైన ఐశ్వర్యసాయంత్రం బయటకు వెళ్లేందుకు రాధ రెడీ అవుతుంది. ఇంతలో విక్రమ్ వస్తాడు. సాయంత్రం ప్రోగ్రాం ఫిక్స్ చేశావ్ కదా అందుకే త్వరగా వచ్చా అని విక్రమ్ అంటాడు. నా కోసం త్వరగా వచ్చారా అని రాధ సంబరపడుతుంది. నేను రెడీ అవుతాను.. అంతలోపు కాఫీ తీసుకుని వస్తావా? అని విక్రమ్ అంటాడు. ఇదంతా చూస్తూ ప్రియ కుళ్లుకుంటుంది. ఇక కిచెన్లో కాఫీ పెడుతున్న రాధ వద్దకు ప్రియ వచ్చి.. నీ మనసులోని మాటల్ని చెప్పాలి అని అనుకుంటున్నావా? అని అడుగుతుంది. అవును అని రాధ అంటుంది. నిన్ను మా బావ ఎందుకు ఒప్పుకుంటాడు అని ప్రియ అంటుంది. ఒప్పుకుంటాడు అని రాధ అంటుంది. అంతటితో ఎపిసోడ్ పూర్తవుతుంది.