
దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్లో సీనియర్ కంటెంట్ ఎడిటర్గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు.
గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు. Allu Arjun Stampede Case News: హైదరాబాదులోని సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించిన ప్రముఖ సినీ నటుడు అల్లు అర్జున్ కు నాంపల్లి కోర్టు సమన్లు జారీ చేసింది. రాబోయే సోమవారం నాడు కోర్టు ముందు వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాలని న్యాయస్థానం ఆయనను ఆదేశించింది.
ఈ ఘోర ప్రమాదానికి సంబంధించి చిక్కడపల్లి పోలీసులు ఇప్పటికే 23 మందిని నిందితులుగా చేర్చుతూ కోర్టులో ఛార్జ్షీటు దాఖలు చేశారు. వీరిలో 19 మంది నిందితులకు నాంపల్లి కోర్టు తాజాగా సమన్లు జారీ చేసింది. ఈ కేసులో ప్రధాన నిందితులుగా సంధ్య థియేటర్కు చెందిన యాజమాన్యం, సిబ్బందిని A1 నుంచి A10 వరకు ఛార్జ్షీట్లో చేర్చారు.
అలాగే ఏ 11 నిందితుడిగా నటుడు అల్లు అర్జున్ పేరును పోలీసులు ఈ కేసులో చేర్చారు. ఏం జరిగిందంటే? 2024 డిసెంబర్ 4 తేదీన ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్ వద్ద 'పుష్ప 2' సినిమా బెనిఫిట్ షో ప్రదర్శించనున్నారు. ఈ సందర్భంగా నటుడు అల్లు అర్జున్ అక్కడికి రావడంతో భారీగా అభిమానులు తరలివచ్చారు.
ఆ సమయంలో తీవ్రమైన తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ దురదృష్టకర తొక్కిసలాటలో రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోగా.. ఆమె కుమారుడు శ్రీ తేజ తీవ్రంగా గాయపడ్డాడు. తాజాగా ఈ కేసులో నాంపల్లి కోర్టు నుంచి నోటీసులు అందుకున్న నిందితులంతా సోమవారం నాడు కోర్టుకు వ్యక్తిగతంగా హాజరు కావాల్సి ఉంటుంది.
నిందితుల హాజరు నమోదు ప్రక్రియ పూర్తయిన తర్వాత.. నాంపల్లి కోర్టు ఈ
కేసు పై అధికారికంగా ట్రయల్ విచారణ ప్రారంభించనుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.