
AP Tobacco farmers:ఏదైనా కేజీ రూ.200 తగ్గకూడదు నో బిడ్… లో బిడ్ ఉండకూడదు. మార్కెట్ కు వచ్చిన పంట కొనాల్సిందే.. ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టీకరణ. పొగాకు రైతుల ప్రయోజనాలను కాపాడడమే తమ ప్రభుత్వ ప్రాధాన్యతని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు.
మార్కెట్లో పొగాకు రకం ఏదైనా కిలో రూ. 200 కంటే తగ్గడానికి వీల్లేదని సిఎం చంద్ర బాబు స్పష్టం చేశారు. రాష్ట్ర సచివాలయంలో పొగాకు రైతులు, ట్రేడర్లతో ముఖ్య మంత్రి సమావేశం నిర్వహించి పొగాకు ధరలపై సమీక్షించారు. ఇటు రైతులు, అటు ట్రేడర్ల సమ స్యలను తెలుసుకున్నారు.
ప్రస్తుత పరిస్థితుల్లో పొగాకు రైతులను ఆదుకునేందుకు ట్రేడర్లు, కొనుగోళ్ల కంపెనీలు నూటికి నూరు శాతం మానవీయ కోణంలో రైతులకు సహకరించాలని సిఎం చంద్రబాబు స్పష్టం చేశారు. పొగాకు వేలం కేంద్రాల్లో నో బిడ్, లో బిడ్ అనే మాటలకు తావుండకూడదన్నారు.
రైతులు మార్కెట్టుకు తెచ్చిన పొగాకు బేళ్లను వెనక్కి పంపే పరిస్థితులు అస్సలు ఉండకూడదని చెప్పారు. మార్కెట్లోకి వచ్చిన పొగాకును కంపెనీలు కొనుగోలు చేయాల్సిందేనని తేల్చి చెప్పారు. దీనికి అనుగుణంగా అన్ని పొగాకు వేలం ప్లాట్ఫారమ్లను పూర్తి స్థాయిలో ప్రారంభించాలని చేయాలని ఆదేశించారు.
అలాగే పొగాకు కంపెనీలన్నీ తప్పనిసరిగా కొనుగోళ్లు చేపట్టాలని, ఏ ఒక్క కంపెనీ కూడా వెనక్కు వెళ్లడానికి వీల్లేదని స్పష్టం చేశారు. టొబాకో బోర్డ్ పరిధిలో కాకుండా అనధికారికంగా కొనుగోళ్లు జరిపిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే అరెస్టులు చేస్తామని ముఖ్యమంత్రి హెచ్చరించారు.
Read also: Srikalahasti news: శ్రీకాళహస్తిలో మహిళలకు 6.3 కోట్ల రుణాలు అందించిన సుధీర్ రెడ్డి ఈ ఏడాది పొగాకు ట్రేడర్లు, కంపెనీలు ప్రభుత్వానికి, రైతులకు సహకరించాలని సిఎం చంద్రబాబు కోరారు. రాబోయే ఏడాది నుంచి మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా ప్రణాళికలు సిద్దం చేస్తామని, ప్రత్యామ్నాయ పంటలను ప్రొత్సహిస్తామని ముఖ్యమంత్రి చెప్పారు.
విధాలా ప్రయత్నిస్తుందన్నారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతామని చెప్పారు. రైతులు, టొబాకో బోర్టు ప్రతినిధులను వెంట పెట్టుకుని ఢిల్లీ వెళ్లి సంబంధిత మంత్రులు, అధికారులను కలవాలని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడును సిఎం చంద్రబాబు ఆదేశించారు. ఈ సమావేశంలో మంత్రులు అచ్చెన్నాయుడు, ఆనం రాంనారాయణ రెడ్డి, గొట్టిపాటి రవికుమార్, డివిబి స్వామి, ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన పలువురు ప్రజా ప్రతినిధులు, టొబాకో బోర్డ్ ప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Telangana rainfall deficit: రాష్ట్రంలో లోటు వర్షపాతం.. నిరాశలో అన్నదాతలు
గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.
AP Aqua Farmers: ఆక్వా ఫీడ్ ధర కేజీ రూ.4 తగ్గింపు
Srikalahasti news: శ్రీకాళహస్తిలో మహిళలకు 6.3 కోట్ల రుణాలు అందించిన సుధీర్ రెడ్డి
El Nino impact: ఎల్నినో దెబ్బ.. భారత్లో 10 శాతం తగ్గనున్న వర్షపాతం
Jonnagiri Sand Mining: ఇసుక లూటీపై ఇడి విచారణ
New Ration Cards: కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్.. త్వరలో కొత్త రేషన్ కార్డులు.. అప్లై చేసుకోండిలా
Gold Rate Today: నేటి బంగారం ధరలు.. 10 గ్రాములకు ఎంతంటే?
అలాగే పొగాకు మార్కెట్ స్థిరీకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని