
పాకిస్థాన్లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్లో తీవ్ర సంచలనం సృష్టించిన వృద్ధ సిక్కు దంపతుల హత్య కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. ఘటన జరిగిన మూడు రోజుల తర్వాత ప్రధాన నిందితుడిని అరెస్ట్ చేసినట్లు అధికారులు ప్రకటించారు.
ఈ కేసుకు సంబంధించి షేర్ షా అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు ధ్రువీకరించారు.వివరాల్లోకి వెళితే.. పెషావర్కు 60 కిలోమీటర్ల దూరంలోని మర్దాన్ జిల్లా, బాబు మొహల్లాలో ఉన్న గురుద్వారాలో సంరక్షకులుగా పనిచేస్తున్న జగన్నాథ్ (70), ఆయన భార్య అస్మా వంతిని గుర్తుతెలియని దుండగులు బుధవారం కాల్చి చంపారు.
ఈ దారుణ ఘటన గురుద్వారా ప్రాంగణంలోనే చోటుచేసుకోవడం తీవ్ర కలకలం రేపింది.ఈ హత్య కేసు దర్యాప్తు కోసం పోలీసులు, కౌంటర్-టెర్రరిజం డిపార్ట్మెంట్ (సీటీడీ) అధికారులతో కలిసి ఒక జాయింట్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (జేఐటీ) ఏర్పాటు చేశారు. మర్దాన్ జిల్లా పోలీస్ ఆఫీసర్ (డీపీఓ) మసూద్ అహ్మద్ బంగాష్ మాట్లాడుతూ..
ప్రాథమిక దర్యాప్తులో నిందితుడికి ఎలాంటి ఉగ్రవాద సంస్థలతో గానీ, నిషేధిత నెట్వర్క్లతో గానీ సంబంధాలు ఉన్నట్లు ఆధారాలు లభించలేదని తెలిపారు. హత్యకు గల అసలు కారణాలు ఇంకా తెలియరాలేదని, నిందితుడి వాంగ్మూలం, ఇతర సాక్ష్యాధారాల ఆధారంగా అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నామని ఆయన వివరించారు.భద్రతా వైఫల్యంపై ఆరోపణలుపాకిస్థానీ మీడియా కథనాల ప్రకారం గురుద్వారా భద్రత కోసం ఒక పోలీస్ గార్డ్ను నియమించినప్పటికీ, దాడి జరిగిన సమయంలో అతను విధుల్లో లేడని తెలుస్తోంది.
ప్రాంగణంలో సీసీటీవీ కెమెరాలు ఉన్నా, వాటి డిజిటల్ వీడియో రికార్డర్ (డీవీఆర్) పనిచేయడం లేదని దర్యాప్తు