
మహారాష్ట్ర రాజకీయాల్లో ఇరవై ఏళ్ల నాటి పాత హత్య కేసు ఇప్పుడు సరికొత్త సంచలనానికి కేంద్ర బిందువుగా మారింది. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పవన్ రాజే నింబాళ్కర్, ఆయన డ్రైవర్ సమద్ కాజీలను 2006 జూన్లో నవీ ముంబై వద్ద కాల్చి చంపిన కేసులో ముంబైలోని ప్రత్యేక సీబీఐ కోర్టు రేపు (20వ తేదీ) తుది తీర్పును వెలువరించనుంది.
ఈ తీర్పు వెలువడే సమయం ప్రస్తుతం శివసేన (ఉద్ధవ్ బాలాసాహెబ్ థాకరే) పార్టీలో చెలరేగిన ఎంపీల తిరుగుబాటు ఆరోపణలతో ముడిపడి ఉండటం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. పవన్ రాజే కుమారుడు, ధారాశివ్ (పాత పేరు ఉస్మానాబాద్) ప్రస్తుత ఎంపీ అయిన ఓంరాజే నింబాళ్కర్ను లక్ష్యంగా చేసుకుని ప్రత్యర్థి వర్గాలు చక్రం తిప్పుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.శివసేన యూబీటీకి చెందిన ఆరుగురు లోక్సభ సభ్యులను ఏక్నాథ్ షిండే నాయకత్వంలోని అధికార శివసేనలో విలీనం చేసేందుకు ‘ఆపరేషన్ టైగర్’ పేరిట ఒక రహస్య ప్రణాళిక జరిగినట్లు తెలుస్తోంది.
ఈ తిరుగుబాటుపై శివసేన యూబీటీ ప్రధాన ప్రతినిధి సంజయ్ రౌత్ ఢిల్లీలో జరిగిన విలేకరుల సమావేశంలో తీవ్ర ఆరోపణలు చేశారు. పవన్ రాజే హత్య కేసులో ఇరవై ఏళ్లుగా న్యాయం కోసం పోరాడుతున్న ఓంరాజే నింబాళ్కర్ను కొందరు ప్రభావవంతమైన వ్యక్తులు సంప్రదించారని రౌత్ పేర్కొన్నారు.
ఆయన గనుక ఉద్ధవ్ థాకరే పక్షాన్ని వీడి షిండే వర్గంలో చేరితే, ఈ సుదీర్ఘ కేసులో కోర్టు నుంచి పూర్తి ఉపశమనం లభించేలా చూస్తామని ఒత్తిడి తెచ్చారని, అందుకోసమే మొదట జూన్ 16న రావలసిన తీర్పును