
మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Fuel prices: దేశంలోని సాధారణ ప్రజలకు పెట్రోల్, డీజిల్ ధరలు వారి గృహ బడ్జెట్లపైనా, దేశ ద్రవ్యోల్బణ రేటుపైనా ప్రత్యక్షంగా ప్రభావం చూపుతాయి. కొంతకాలంగా, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు భారీగా తగ్గడంతో, ప్రభుత్వం త్వరలోనే పెట్రోల్, డీజీల్ ధరలను తగ్గించి ఉపశమనం కలిగిస్తుందని దేశవ్యాప్తంగా వినియోగదారులు ఆశించారు.
అయితే.. పెట్రోలియం మంత్రిత్వ శాఖ పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపుపై కీలక ప్రకటన జారీ చేసింది. ఇంధన ధరల తగ్గింపునకు సంబంధించి ఒక కీలకమైన ప్రకటన విడుదలైంది. దేశంలో ఇంధన ధరలను తగ్గించడం లేదా మార్చడం వంటి ఏ నిర్ణయమైనా పూర్తిగా మారుతున్న ప్రపంచ పరిస్థితులు..
అంతర్జాతీయ మార్కెట్ స్థిరత్వంపై ఆధారపడి ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. పెట్రోలియం.. సహజ వాయువుల మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ మాట్లాడుతూ.. మధ్యప్రాచ్య సంక్షోభ సమయంలో ముడి చమురు ధరలు బ్యారెల్కు 120 డాలర్లకు చేరుకున్నాయని..
అయితే ఇప్పుడు అవి తగ్గుముఖం పడుతున్నాయని తెలిపారు. ప్రభుత్వం మార్కెట్ పరిస్థితులను నిశితంగా పర్యవేక్షిస్తోందన్నారు. రిటైల్ ఇంధన ధరలకు సంబంధించి భవిష్యత్తులో తీసుకునే ఏవైనా నిర్ణయాలు అంతర్జాతీయ పరిస్థితులు.. ముడి చమురు ధరలపై ఆధారపడి ఉంటాయని ఆమె తెలిపారు.
రిటైల్ ధరలను తగ్గించేందుకు తొందరపాటు నిర్ణయం : రిటైల్ ధరలను తగ్గించేందుకు ప్రభుత్వం ఎలాంటి తొందరపాటు నిర్ణయం తీసుకోవడం లేదని మంత్రిత్వశాఖ ఉన్నతాధికారుల వర్గాలు చెబుతున్నాయి. దీనికి వెనక ప్రధాన కారణం ఏంటంటే.. మారుతున్న ప్రపంచ భౌగోళిక రాజకీయ పరిస్ధితులు అని చెబుతున్నారు.
ప్రకారం.. చమురు మార్కెట్ అత్యంత అస్థిరంగా ఉంటుంది. కొత్తగా వచ్చే ప్రపంచ ఉద్రిక్తతలు లేదా ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ తీసుకునే నిర్ణయాల కారణంగా ఈరోజు తగ్గిన ధరలు రేపు అకస్మాత్తుగా మళ్లీ పెరగవచ్చు. అందువల్ల.. ప్రపంచ మార్కెట్లో ముడి చమురు ధరలు దీర్ఘకాలం పాటు ఒక నిర్దిష్ట పరిధిలో స్థిరపడే వరకు దేశీయ స్థాయిలో ఎలాంటి పెద్ద నిర్ణయం తీసుకోవడం తొందరపాటు అవుతుందని భావిస్తోంది. ముడిచమురు అవసరాలకు 85శాతం విదేశాలపై ఆధారపడటం: భారత్ తన ముడిచమురు అవసరాలను సుమారు 85శాతం విదేశాలపై ఆధారపడి ఉంది. అందుకే అంతర్జాతీయంగా మార్కెట్లో జరిగే ఏ చిన్న కదలిక అయినా ఇండియన్ ఆయిల్ , భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం వంటి దేశంలోని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలపై నేరుగా ప్రభావం చూపుతుంది. ప్రస్తుతం ముడిచమురు ధరలు భారీగా తగ్గుతున్నాయి. బ్యారెల్ కు 120 డాలర్లు తగ్గినప్పుడు దేశంలో ధరలు పెంచకపోవడం వల్ల తాము ఆర్థిక నష్టాలను ఎదుర్కున్నామని ఈ కంపెనీలు వాదిస్తున్నాయి. ఇప్పుడు ధరలు తగ్గాయి. దీంతో తమ బ్యాలెన్స్ షీట్లను బలోపేతం చేసుకునేందుకు, గత నష్టాలను పూడ్చుకునేందుకు కంపెనీలు సిద్ధంగా ఉన్నాయి
లీటరుకు రూ. 3 నుండి రూ. 5 వరకు తగ్గించే ఛాన్స్: కేవలం ముడిచమురు బేస్ ధరపై మాత్రమే కాదు.. కేంద్ర ప్రభుత్వ ఎక్సైజ్ సుంకం, రాష్ట్ర ప్రభుత్వాల వ్యాట్పై కూడా ఆధారపడి ఉంటుంది. మంత్రిత్వ శాఖ నుండి వచ్చిన ఈ కొత్త ప్రకటన.. ప్రభుత్వం ధరల తగ్గింపులను పూర్తిగా తోసిపుచ్చడం లేదని, బదులుగా వేచి చూసే వైఖరిని అవలంబిస్తోందని సూచిస్తోంది. రాబోయే వారాల్లో ప్రపంచ పరిస్థితులు ప్రశాంతంగా ఉండి, ముడిచమురు ధరలు మునుపటికంటే తక్కువగా కొనసాగినట్లయితే చమురు కంపెనీలు.. మంత్రిత్వ శాఖ సాధారణ ప్రజలకు లీటరుకు రూ. 3 నుండి రూ. 5 వరకు తగ్గించే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం.
ప్రపంచ మార్కెట్లో ప్రశాంతత నెలకొన్నాకే తర్వాతి చర్యలు: దేశ ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడటానికి పెట్రోలియం మంత్రిత్వ శాఖ అనుసరిస్తున్న విధానం అత్యంత ఆచరణాత్మకమైనదని నిపుణులు అంటున్నారు. ఒక్కసారిగా ధరలు భారీగా తగ్గించి.. ఆ తర్వాత అంతర్జాతీయంగా ధరలు పెరిగినప్పుడు మళ్లీ పెంచడం అనేది మార్కెట్లో అనిశ్చిత పరిస్థితులకు కారణం అవుతుంది. అందుకే ఒకసారి ధరలు తగ్గిస్తే.. ప్రజలకు దీర్ఘకాలిక ప్రయోజనాలకు అందించే విధంగా ఉండాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రపంచ మార్కెట్లో ప్రశాంతత నెలకొనే వరకు పెట్రోలియం మంత్రిత్వ శాఖ తర్వాతి చర్యలు తీసుకునే వరకు దేశంలోని వాహనదారులు, వినియోగదారులు వేచి చూడాల్సిందే.
Disclaimer: ఈ కథనంలో పొందుపరిచిన సమాచారం కేవలం సాధారణ అవగాహన కోసం మాత్రమే. ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ పెట్టుబడి, ఆర్థిక, వ్యాపార లేదా న్యాయ సలహాగా పరిగణించరాదు. ఇందులోని వివరాలు ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా సేకరించబడ్డాయి. సమాచార ఖచ్చితత్వంపై జీ తెలుగు న్యూస్ ఎలాంటి హామీ ఇవ్వదు. ఈ సమాచారాన్ని ఆధారంగా చేసుకుని తీసుకునే పెట్టుబడి లేదా ఇతర ఆర్థిక నిర్ణయాలకు సంబంధించి కలిగే లాభనష్టాలకు పూర్తిగా పాఠకులే బాధ్యులు. ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు అర్హత కలిగిన ఆర్థిక సలహాదారులను సంప్రదించడం మంచిది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
గత కొన్నాళ్లుగా కనిపిస్తున్న ముడిచమురు ధరల తగ్గుదల స్థిరత్వాన్ని ప్రభుత్వం ముందుగానే అంచనా వేయాలని భావిస్తోంది. పెట్రోలియం మంత్రిత్వ శాఖ అభిప్రాయం