మెగా పవర్స్టార్ రామ్ చరణ్ నటించిన తాజా చిత్రం 'పెద్ది' బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేటను కొనసాగిస్తోంది. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో క్రీడా నేపథ్యం ఉన్న యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం జూన్ 4వ తేదీన పాన్ ఇండియా రేంజులో తెలుగు సహా పలు భారతీయ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది.
మొదటి రోజు నుంచే అద్భుతమైన ప్రజాదరణను దక్కించుకున్న ఈ సినిమా, కేవలం రెండు వారాల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 400 కోట్ల క్లబ్లోకి అడుగుపెట్టి సరికొత్త రికార్డు సృష్టించినట్లు నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. ఈ భారీ విజయంతో జోరు మీదున్న చిత్రబృందం, థియేటర్లలోకి మరింత మంది ప్రేక్షకులను, రిపీట్ ఆడియన్స్ను ఆకర్షించడానికి సరికొత్త వ్యూహాన్ని అమలు చేసింది.
ఇందులో భాగంగా దాదాపు 5 నిమిషాల 56 సెకన్ల నిడివి గల కొత్త సన్నివేశాలను ఈ సినిమాకు అదనంగా జోడించారు. రామ్ చరణ్ - జాన్వీ కపూర్ మధ్య వచ్చే రెండు సరికొత్త సీన్స్తో పాటు, జగపతిబాబు - చరణ్ కాంబినేషన్లో వచ్చే మరో కీలక సన్నివేశాన్ని యాడ్ చేశారు.
గతంలో జాన్వీ పాత్రకు సంబంధించిన కొన్ని కెమెరా యాంగిల్స్ కట్ చేయగా, ఇప్పుడు శివరాజ్ కుమార్ ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాలను కొన్నింటిని ట్రిమ్ చేసి కొత్త వెర్షన్ను థియేటర్లలోకి తెచ్చారు. ఈ స్ట్రాటజీ ఈ వీకెండ్లో వసూళ్లను మరింత పెంచుతుందని చిత్ర యూనిట్ భావిస్తోంది.* ట్విట్టర్ టాక్: సమంత వన్ ఉమెన్ షో...
'మా ఇంటి బంగారం' ఎలా ఉందంటే..? ఇదిలా ఉంటే, థియేటర్లలో విజయవంతంగా నడుస్తున్న 'పెద్ది' చిత్ర కలెక్షన్లపై ఎలాంటి ప్రభావం పడకూడదనే ఉద్దేశంతో నిర్మాత బండ్ల గణేష్ ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, శ్రుతీహాసన్ జంటగా హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కి సంచలన విజయం సాధించిన 'గబ్బర్ సింగ్' చిత్రాన్ని జూన్ 26వ తేదీన గ్రాండ్గా రీ-రిలీజ్ చేయాలని బండ్ల గణేష్ ప్లాన్
చేశారు. అయితే, రామ్ చరణ్ సినిమా సక్సెస్ఫుల్గా రన్ అవుతున్న తరుణంలో, థియేటర్లను, వసూళ్లను తగ్గించకూడదనే సదుద్దేశంతో ఈ రీ-రిలీజ్ను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని బండ్ల గణేష్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా పంచుకుంటూ.. "మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు నటించిన ‘పెద్ది’ చిత్రం అపూర్వ ప్రజా మద్దతుతో ఇంకా థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతున్న నేపథ్యంలో జూన్ 26న రీ రిలీజ్ చేయాల్సిన ‘గబ్బర్సింగ్’ చిత్రాన్ని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నాం. 'పెద్ది' చిత్ర వసూళ్లకు ఎలాంటి నష్టం వాటిల్లకూడదనే సదుద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నాం. 'గబ్బర్ సింగ్' రీ-రిలీజ్కు సంబంధించిన కొత్త తేదీని త్వరలోనే ప్రకటిస్తాను" అని ట్వీట్ చేశారు. మెగా ఫ్యామిలీకి చెందిన ఇద్దరు హీరోల సినిమాల మధ్య క్లాష్ రాకుండా, పెద్ద సినిమా వసూళ్లను గౌరవిస్తూ బండ్ల గణేష్ తీసుకున్న ఈ నిర్ణయం అటు పవన్ కళ్యాణ్ అభిమానుల్లో, ఇటు రామ్ చరణ్ అభిమానుల్లో మరోసారి ఆయనపై ఉన్న గౌరవాన్ని రెట్టింపు చేసింది. సినిమా వాయిదా పడినందుకు పవన్ ఫ్యాన్స్ కొంత నిరాశ చెందినప్పటికీ, బండ్లన్న తీసుకున్న ఈ మంచి నిర్ణయాన్ని మనస్ఫూర్తిగా అంగీకరిస్తూ గబ్బర్ సింగ్ కొత్త రీ-రిలీజ్ డేట్ కోసం మెగా ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.