
హైదరాబాద్: ఏపీ మద్యం రవాణా కేసులో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కుమారుడు సునీల్కు నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఆయన్ను ఈడీ అధికారులు చంచల్గూడ జైలుకు తరలించారు.
అంతకు ముందు కోర్టులో వాదనల సందర్భంగా ఈడీ తరఫు న్యాయవాది మాట్లాడుతూ.. కారుమూరి నాగేశ్వరరావు పలుకుబడితో సునీల్ భారీగా లబ్ధి పొందారన్నారు. సుదర్శన్ కన్స్ట్రక్షన్కు చెందిన సందీప్, ప్రతాప్రెడ్డికి కాంట్రాక్టులు వచ్చాయని చెప్పారు. కాంట్రాక్టులు ఇప్పించినందుకు సునీల్కు రూ.28 కోట్లు ముడుపులు దక్కాయని తెలిపారు. కారుమూరి సునీల్కు రిమాండ్ |