
అక్కినేని కంపౌండ్ నుంచి సుమంత్ హీరోగా, ఆధ్యాత్మిక అంశాల నేపథ్యంలో విలక్షణమైన చిత్రాలను తెరకెక్కించే దర్శకుడు సంతోష్ జాగర్లపూడి కాంబినేషన్లో వస్తున్న సరికొత్త చిత్రం ‘మహేంద్రగిరి వరాహి’. భక్తి, పురాతన నమ్మకాలు, సైన్స్ అండ్ మిస్టరీ చుట్టూ తిరిగే ఈ ఆధ్యాత్మిక సస్పెన్స్ థ్రిల్లర్ అఫీషియల్ టీజర్ విడుదలైన క్రమంలో సోషల్ మీడియాను ఊపేస్తూ, సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది.
మహేంద్రగిరి కొండల బ్యాక్డ్రాప్లో, వరాహి మాత దివ్య శక్తి చుట్టూ అల్లిన కథతో ఈ సినిమా రూపొందుతోంది. తాజాగా విడుదలైన టీజర్ ఆడియన్స్ను సరికొత్త లోకంలోకి తీసుకెళ్లింది. అక్కడ జరిగే కొన్ని అంతుచిక్కని సంఘటనలు, భూగర్భంలో దాగి ఉన్న రహస్యాలు, ప్రకృతి సృష్టించే వింతలు ఈ టీజర్లో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.
ప్రతి ఫ్రేమ్లోనూ ఒక తెలియని గంభీరమైన వాతావరణాన్ని, హారర్ ఎలిమెంట్స్ని దర్శకుడు పర్ఫెక్ట్గా ఎలివేట్ చేశారు. విజువల్స్ చాలా గ్రాండ్గా ఉండటమే కాకుండా, సినిమా కథలో ఏదో ఒక పెద్ద రహస్యమే దాగి ఉందనే క్యూరియాసిటీని ప్రేక్షకుల్లో బలంగా నాటాయి.
ఈ సినిమాకు ప్రముఖ సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ (BGM) టీజర్కు ప్రాణంగా నిలిచింది. ఆధ్యాత్మిక శ్లోకాలతో పాటు, థ్రిల్లింగ్ సీన్లను నెక్ట్స్ లెవెల్కి తీసుకెళ్లేలా ఆయన మ్యూజిక్ అందించారు. ప్రతాప్ ఆర్.
కృష్ణా సినిమాటోగ్రఫీ మైండ్ బ్లోయింగ్ అనిపించేలా ఉంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు అన్నపూర్ణ స్టూడియోస్ లో శరవేగంగా జరుగుతున్నాయి. రాజశ్యామల ఎంటర్టైన్మెంట్స్ మరియు బ్రిడ్జ్ ఫిల్మ్స్ బ్యానర్లపై కలిపు మధు, లక్ష్మణ్ సంయుక్తంగా ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఇందులో సుమంత్ సరసన ఐశ్వర్యా రాజేష్ హీరోయిన్గా నటిస్తుండగా.. మీనాక్షి గోస్వామి, మాళవిక నాయర్, హాస్యబ్రహ్మ బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, రాజీవ్ కనకాల, అలీ లాంటి భారీ తారాగణం కీలక పాత్రలు పోషిస్తున్నారు
.