
అమరావతి: ‘నీట్’ పరీక్షకు హాజరయ్యే విద్యార్థుల సౌకర్యార్థం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక చర్యలు చేపట్టింది. హాల్ టికెట్ చూపించిన నీట్ విద్యార్థులకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్నట్లు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి వెల్లడించారు.
రాష్ట్రవ్యాప్తంగా నీట్ విద్యార్థుల కోసం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. దేశ వ్యాప్తంగా జూన్ 21న మళ్లీ నీట్ పరీక్ష జరగనున్న విషయం తెలిసిందే. AP: నీట్ పరీక్ష.. విద్యార్థులకు ఉచిత బస్సు ప్రయాణం
|