భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఎన్నో రికార్డులు క్రియేట్ అవుతూ ఉంటాయి. మరెన్నో రికార్డులు కాలగర్భంలో కలిసిపోతుంటాయి. కానీ టాలీవుడ్లో మెగా ఫ్యామిలీ సృష్టించిన ఈ సరికొత్త రికార్డు మాత్రం ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఎప్పటికీ నిలిచిపోయే ఒక అరుదైన మైలురాయిగా చెప్పొచ్చు.
ఒకే క్యాలెండర్ ఇయర్లో తండ్రి, కొడుకు ఇద్దరూ విడివిడిగా బాక్సాఫీస్ వద్ద రూ. 300 కోట్ల గ్రాస్ వసూళ్ల మార్కును దాటడం అనేది ఇప్పటివరకు ఏ స్టార్ ఫ్యామిలీకి సాధ్యం కాలేదు. ఆ అసాధ్యమైన ఘనతను మెగాస్టార్ చిరంజీవి , మెగా పవర్స్టార్ రామ్ చరణ్ సుసాధ్యం చేసి చూపించారు.
ఈ గ్లోబల్ రికార్డ్తో మెగా అభిమానులు కాలర్ ఎగరేస్తూ సామాజిక మాధ్యమాల్లో పండగ చేసుకుంటున్నారు.గత కొంతకాలంగా సరైన కమర్షియల్ సక్సెస్ లేక ట్రేడ్ వర్గాలు డీలా పడిపోయిన తరుణంలో.. బాక్సాఫీస్కు తనదైన శైలిలో మాస్ ఊపు తెచ్చారు మెగాస్టార్ చిరంజీవి.
ఈ ఏడాది సంక్రాంతి కానుకగా వచ్చిన 'మన శంకర వర ప్రసాద్ గారు' చిత్రంతో ఆయన థియేటర్లలో విజువల్ ఫీస్ట్ అందించారు. చిరు వింటేజ్ మాస్ లుక్, నటనకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఫలితంగా ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 300 కోట్లకు పైగా గ్లోబల్ గ్రాస్ వసూళ్లను సాధించి, మెగాస్టార్ బాక్సాఫీస్ స్టామినా ఏంటో ఇండస్ట్రీకి మరోసారి ఘనంగా చాటిచెప్పింది.* రూ.400 కోట్ల క్లబ్కి అడుగు దూరంలో ‘పెద్ది’..
పద్దుల చిట్టా బయటపెట్టిన నిర్మాత ‘పెద్ది’ కలెక్షన్ల సునామీ ఒకవైపు తండ్రి బాక్సాఫీస్ వద్ద విధ్వంసం సృష్టిస్తే.. మరోవైపు కొడుకు రామ్ చరణ్ అంతకుమించిన వేగంతో సరికొత్త రికార్డులను వేటాడుతున్నారు. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో వచ్చిన ఇన్స్పైరింగ్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’ ప్రస్తుతం థియేటర్లలో దూసుకుపోతోంది.
ఈ చిత్రం విడుదలైన కేవలం 11 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ. 393 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి సరికొత్త సంచలనం సృష్టించింది. కేవలం పది రోజుల్లోనే చరణ్ సినిమా
.. ‘మన శంకర వర ప్రసాద్ గారు’ సాధించిన మొత్తం కలెక్షన్లను చాలా సులువుగా అధిగమించడం విశేషం. ఇది చరణ్ కెరీర్లోనే ఒక ల్యాండ్మార్క్ హిట్గా నిలిచింది. వారసత్వాన్ని దాటి.. గ్లోబల్ స్టార్గాసినిమా నేపథ్యం ఉన్న కుటుంబంలో పుట్టడం వల్ల పరిశ్రమలోకి అడుగుపెట్టడం సులభం కావచ్చు. కానీ, స్టార్డమ్ అందుకోవాలన్నా, దాన్ని కాపాడుకోవాలన్నా సొంత కష్టం, నటనపై పట్టు, కథల ఎంపిక చాలా ముఖ్యం. రామ్ చరణ్ ప్రయాణమే దీనికి నిదర్శనం. కెరీర్ ఆరంభంలో ‘చిరుత, మగధీర, నాయక్, ఎవడు, ధృవ’ వంటి కమర్షియల్ చిత్రాలతో మెప్పించిన చరణ్.. ‘రంగస్థలం, RRR’, ప్రస్తుత ‘పెద్ది’ చిత్రాలతో నటుడిగా తనలోని సరికొత్త విశ్వరూపాన్ని ప్రపంచానికి పరిచయం చేశారు. ఈ సినిమాలు భారీ వసూళ్లతో పాటు విమర్శకుల ప్రశంసలనూ దక్కించుకున్నాయి. భారతీయ సినీ చరిత్రలో ఎన్నో ప్రతిష్టాత్మక నటవారసత్వ కుటుంబాలు ఉన్నప్పటికీ, ఏ తండ్రీకొడుకులూ ఒకే ఏడాదిలో ఇరువైపులా ఇంతటి భారీ బిజినెస్ సామ్రాజ్యాన్ని శాసించలేదు. ఈ అసాధారణ విజయం ద్వారా రామ్ చరణ్ తన తండ్రి ఇమేజ్ ఛాయల నుంచి బయటకు వచ్చి, సొంతంగా గ్లోబల్ మార్కెట్ను ఏలగలరని నిరూపించుకున్నారు. వారసత్వంగా వచ్చిన పేరును బాధ్యతగా మలచుకుంటూ, కష్టపడే తత్వంతో ఆయన నేటి తరం టాప్ హీరోల వరుసలో అగ్రస్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. మొత్తానికి ఒకే క్యాలెండర్ ఇయర్లో తండ్రీకొడుకులు ఇద్దరూ రూ. 300 కోట్ల క్లబ్లో చేరి టాలీవుడ్లో మెగా ఫ్యామిలీకి తిరుగులేదని మరోసారి నిరూపించారు.