
భారత ఆటోమొబైల్ రంగం మే నెలలో సరికొత్త చరిత్ర సృష్టించింది. ప్యాసింజర్ వాహనాలు, టూవీలర్లు, త్రీవీలర్ల విభాగాల్లో ఎన్నడూ లేనంతగా అత్యధిక అమ్మకాలను నమోదు చేసి ఆల్ టైమ్ రికార్డును నెలకొల్పింది. ఈ మేరకు సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్ (ఎస్ఐఏఎం) నేడు గణాంకాలను విడుదల చేసింది.
ఈ గణాంకాల ప్రకారం అన్ని ప్రధాన వాహన విభాగాలు మే నెలలో తమ అత్యుత్తమ ప్రదర్శనను కనబరిచాయి.మే నెలలో దేశీయ ప్యాసింజర్ వాహనాల (పీవీ) అమ్మకాలు రికార్డు స్థాయిలో 4,38,854 యూనిట్లుగా నమోదయ్యాయి. గతేడాది ఇదే నెలలో అమ్ముడైన 3,44,656 యూనిట్లతో పోలిస్తే ఇది 27.3 శాతం అధికం.
స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్స్ (ఎస్యూవీ)కు కొనసాగుతున్న డిమాండ్, ఎంట్రీ-లెవల్ కార్ల విభాగం పుంజుకోవడం, మెరుగైన కొనుగోలు శక్తి ఈ వృద్ధికి దోహదపడ్డాయి.టూవీలర్ల విభాగం కూడా మే నెలలో తన అత్యుత్తమ పనితీరును కనబరిచింది. మొత్తం 19,02,209 యూనిట్ల అమ్మకాలతో 14.8 శాతం వృద్ధిని నమోదు చేసింది.
ఇందులో స్కూటర్ల అమ్మకాలు 27.4 శాతం పెరిగి 7,39,667 యూనిట్లకు చేరగా, మోటార్సైకిళ్ల అమ్మకాలు 7.2 శాతం వృద్ధితో 11,13,973 యూనిట్లుగా నమోదయ్యాయి. అలాగే, మోపెడ్ల అమ్మకాలు కూడా 30.3 శాతం పెరిగాయి.త్రీవీలర్ల అమ్మకాలు సైతం జోరు చూపించాయి.
గతేడాది మే నెలలో 53,942 యూనిట్లు అమ్ముడుపోగా, ఈసారి 31.1 శాతం వృద్ధితో 70,720 యూనిట్లకు చేరాయి. ఇందులో ప్యాసింజర్ క్యారియర్లు 30 శాతం, గూడ్స్ క్యారియర్లు 35.3 శాతం చొప్పున వృద్ధి సాధించాయి. ఎలక్ట్రిక్ త్రీవీలర్ విభాగంలోనూ మంచి