
మధ్యప్రదేశ్ లోని మోరెనా సమీపంలో ఆదివారం ఘోర రైలు ప్రమాదం సంభవించింది. ఒక రైలు నిలిచిపోవడంతో కిందకు దిగిన ప్రయాణికులను మరో రైలు బలంగా ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ఒక చిన్నారితో సహా నలుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మరణించారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు.
ప్రమాద తీవ్రతను గమనించిన స్థానికులు, రైల్వే అధికారులు వెంటనే సహాయక చర్యలను ప్రారంభించారు.రైల్వే అధికారుల కథనం ప్రకారం.. 2026 జూన్ 14న సాయంత్రం 4:15 గంటల సమయంలో ఖజురాహో- ఉదయ్పూర్ ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ (ట్రెయిన్ నెం. 19665) ఝాన్సీ డివిజన్ పరిధిలోని హేతంపూర్, ధోల్ పూర్ స్టేషన్ల మధ్య ఆగిపోయింది.
జనరల్ కోచ్ లోని ఒక ప్రయాణికుడు ఎమర్జెన్సీ చైన్ లాగడంతో ఈ రైలు నిలిచిపోయింది. ఆ సమయంలో రైలులో మంటలు చెలరేగాయనే పుకారుతో ప్రయాణికులు భయంతో పక్కనే ఉన్న ట్రాక్ పైకి దిగారు.దుర్ఘటనకు గల కారణాలుప్రయాణికులు పక్క ట్రాక్ పై ఉన్న సమయంలోనే ఎదురుగా వస్తున్న ఫిరోజ్ పూర్-సియోని పాతాల్ కోట్ ఎక్స్ప్రెస్ (ట్రెయిన్ నెం.
20424) వారిని ఢీకొట్టింది. ఈ ఘటనపై ఉత్తర మధ్య రైల్వే విభాగం అధికారిక ప్రకటన విడుదల చేసింది. రైలు ఆగడంతో కొంతమంది ప్రయాణికులు కిందకు దిగారు. ఆ సమయంలో లైన్ పై దూసుకొచ్చిన పాతాల్ కోట్ ఎక్స్ ప్రెస్ ప్రయాణికులను ఢీకొట్టడంతో నలుగురు ప్రాణాలు కోల్పోయారు అని రైల్వే శాఖ పేర్కొంది.ఈ ప్రమాదంలో మరణించిన వారిని ఉత్తరప్రదేశ్ కు చెందిన ఆఫ్రీన్ (35), ఆమె నాలుగు సంవత్సరాల కుమారుడు, శకుంతల (60)తో పాటు రాజస్థాన్కు చెందిన వీర్మాదేవి (60)గా గుర్తించారు.
ఘటనా స్థలానికి రైల్వే భద్రతా బలగాలు (RPF), ప్రభుత్వ రైల్వే పోలీస్ (GRP), స్థానిక అధికారులు చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. అనంతరం అధికారులు మాట్లాడుతూ బాధితులకు అవసరమైన అన్ని రకాల సహాయాన్ని అందిస్తున్నాం. ప్రమాదానికి గల పూర్తి కారణాలపై లోతైన విచారణ జరుపుతున్నాం అని తెలిపారు.
మధ్యప్రదేశ్‌ లోని మోరెనా సమీపంలో ఆదివారం ఘోర రైలు ప్రమాదం సంభవించింది. ఒక రైలు నిలిచిపోవడంతో కిందకు దిగిన ప్రయాణికులను మరో రైలు బలంగా ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ఒక చిన్నారితో సహా నలుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మరణించారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద తీవ్రతను గమనించిన స్థానికులు, రైల్వే అధికారులు వెంటనే సహాయక చర్యలను ప్రారంభించారు.రైల్వే అధికారుల కథనం ప్రకారం.. 2026 జూన్ 14న సాయంత్రం 4:15 గంటల సమయంలో ఖజురాహో- ఉదయ్‌పూర్ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ (ట్రెయిన్ నెం. 19665) ఝాన్సీ డివిజన్‌ పరిధిలోని హేతంపూర్, ధోల్‌ పూర్ స్టేషన్ల మధ్య ఆగిపోయింది. జనరల్ కోచ్‌ లోని ఒక ప్రయాణికుడు ఎమర్జెన్సీ చైన్ లాగడంతో ఈ రైలు నిలిచిపోయింది. ఆ సమయంలో రైలులో మంటలు చెలరేగాయనే పుకారుతో ప్రయాణికులు భయంతో పక్కనే ఉన్న ట్రాక్‌ పైకి దిగారు.దుర్ఘటనకు గల కారణాలుప్రయాణికులు పక్క ట్రాక్‌ పై ఉన్న సమయంలోనే ఎదురుగా వస్తున్న ఫిరోజ్‌ పూర్-సియోని పాతాల్‌ కోట్ ఎక్స్‌ప్రెస్ (ట్రెయిన్ నెం. 20424) వారిని ఢీకొట్టింది. ఈ ఘటనపై ఉత్తర మధ్య రైల్వే విభాగం అధికారిక ప్రకటన విడుదల చేసింది. రైలు ఆగడంతో కొంతమంది ప్రయాణికులు కిందకు దిగారు. ఆ సమయంలో లైన్‌ పై దూసుకొచ్చిన పాతాల్‌ కోట్ ఎక్స్‌ ప్రెస్ ప్రయాణికులను ఢీకొట్టడంతో నలుగురు ప్రాణాలు కోల్పోయారు అని రైల్వే శాఖ పేర్కొంది.ఈ ప్రమాదంలో మరణించిన వారిని ఉత్తరప్రదేశ్‌ కు చెందిన ఆఫ్రీన్ (35), ఆమె నాలుగు సంవత్సరాల కుమారుడు, శకుంతల (60)తో పాటు రాజస్థాన్‌కు చెందిన వీర్మాదేవి (60)గా గుర్తించారు. ఘటనా స్థలానికి రైల్వే భద్రతా బలగాలు (RPF), ప్రభుత్వ రైల్వే పోలీస్ (GRP), స్థానిక అధికారులు చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. అనంతరం అధికారులు మాట్లాడుతూ బాధితులకు అవసరమైన అన్ని రకాల సహాయాన్ని అందిస్తున్నాం. ప్రమాదానికి గల పూర్తి కారణాలపై లోతైన విచారణ జరుపుతున్నాం అని తెలిపారు. ఇక ప్రస్తుతం క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందుతుండగా, ట్రాక్‌ పై రైళ్ల రాకపోకలను పునరుద్ధరించేందుకు అధికారులు అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు.
ఇక ప్రస్తుతం