
అమరావతి: చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యం కేసుపై హోం మంత్రి వంగలపూడి అనిత కాకినాడ జిల్లా ఎస్పీతో మాట్లాడారు. కేసు వివరాలపై ఆరా తీశారు. హోం మంత్రి ఆదేశాలతో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఫారెస్ట్ బృందాలు రంగంలోకి దిగాయి. ఈ సందర్భంగా అధికారులకు హోం మంత్రి పలు సూచనలు చేశారు. చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యం కేసులో ప్రభుత్వం అత్యంత అప్రమత్తంగా ఉందని వెల్లడించారు. ఈ కేసులో అధికారులు సమన్వయంతో పని చేస్తున్నారని హోం మంత్రి తెలిపారు. కాకినాడ జిల్లా తుని మండలం దొండవాక పంచాయతీ సీహెచ్ అగ్రహారానికి చెందిన రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి గత శనివారం అదృశ్యమైన విషయం తెలిసిందే. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు
.