
మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. pradhan mantri mudra yojana: ప్రపంచంలోనే అతిపెద్ద సోషల్ వెల్ఫేర్ స్కీమ్ గా ముద్ర యోజన స్కీమ్ ఆదరణ పొందింది. ముఖ్యంగా ముద్ర యోజన స్కీం ద్వారా ప్రతి ఏడాది దాదాపు లక్షలాది మంది యువత ఎలాంటి గ్యారెంటీ లేకుండానే బ్యాంకుల నుంచి లోన్ పొందుతున్నారు. ముద్రా యోజన స్కీం ద్వారా కొత్తగా వ్యాపారం చేసేవారు కావచ్చు.. అలాగే ఉన్న వ్యాపారాన్ని మరింత అభివృద్ధి చేసుకోవాలి అనుకునే వారు కూడా ఈ స్క్రీన్ ద్వారా లబ్ధి పొందే అవకాశం ఉంటుంది. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మక ప్రవేశపెట్టిన స్కీం ఏదైనా ఉందంటే అది ప్రధానమంత్రి ముద్ర యోజన స్కీమ్ అనే చెప్పాలి. ఈ స్కీం కింద ఇప్పటికే దాదాపు 50 కోట్లకు మంది పైగా లబ్ధిదారులు దేశవ్యాప్తంగా లబ్ధి పొందుతున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద సోషల్ వెల్ఫేర్ స్క్రీన్ గా ఈ ముద్రా యోజన స్కీమ్. భావిస్తున్నారు. ముఖ్యంగా ముద్రా యోజన స్కీం ద్వారా ప్రతి ఏడాది దాదాపు లక్షలాది మంది యువత ఎలాంటి గ్యారెంటీ లేకుండా బ్యాంకుల నుంచి లోన్ తీసుకుంటున్నారు. ముద్ర యోజన స్కీం ద్వారా కొత్తగా బిజినెస్ చేయాలనుకునే వాళ్ళు కావచ్చు లేదంటే ఉన్న వ్యాపారాన్ని మరింత విస్తరించుకోవాలనుకునేవారు కావచ్చు ఈ లోన్ ద్వారా లబ్ధి పొందే అవకాశం ఉంటుంది. ముద్ర యోజన స్కీం ద్వారా మీరు మీ సమీపంలో ఉన్నటువంటి ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకు నుంచి కూడా లోన్స్ ఎలాంటి తాకట్టు లేకుండానే పొందే అవకాశం ఉంటుంది. ఈ స్కీమ్ ద్వారా మీరు బిజినెస్ ప్రారంభించాలి అనుకున్నట్లయితే మీకు గరిష్టంగా 20 లక్షల రూపాయల వరకు లోన్ అందిస్తారు
. దీనిలో మొత్తం మూడు కేటగిరీలో లోన్స్ అందిస్తారు. కొత్తగా చిన్న వ్యాపారం ప్రారంభించే వారికి శిశు రుణాల కేటగిరిలో భాగంగా 50 వేల రూపాయల వరకు లోన్ పొందవచ్చు. కిషోర్ కేటగిరీలో 5 లక్షల వరకు లోన్స్ పొందవచ్చు. దీనిలో ముఖ్యంగా ఇప్పటికే ఉన్న వ్యాపారాన్ని విస్తరించుకోవడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పాలి.
ఇక తరుణ్ కేటగిరి విషయానికి వచ్చినట్లయితే 5 లక్షల రూపాయల కంటే ఎక్కువగా 10 లక్షల లోపు రుణాలు పొందే ఛాన్స్ ఉంటుంది. ఇది స్థిరపడిన వ్యాపారాన్ని మరింత విస్తరింప చేయాలనుకునే వారికి ఎంతోగానో ఉపయోగపడుతుందని చెప్పాలి. అలాగే తరుణ్ ప్లస్ స్కీం కింద 10 లక్షల కంటే ఎక్కువగా అంటే 20 లక్షల వరకు లోన్స్ పొందే ఛాన్స్ ఉంటుంది. గతంలో తరుణ్ లోన్స్ తీసుకుని సకాలంలో చెల్లించిన వారికి ఈ లోన్స్ ఈజీగా అందిస్తారు. అయితే ఇప్పటివరకు గమనించినట్లయితే దేశవ్యాప్తంగా దాదాపు 40 లక్షల కోట్ల రూపాయలు ఈ లోన్స్ కింద మంజూరు అయ్యాయి. దీనిలో దాదాపు 70% మంది మహిళలే ఉండటం విశేషమని చెప్పాలి.
ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజిక వర్గాలకు చెందిన వారికి సుమారు 50% వరకు లోన్స్ అందిస్తున్నారు. సుమారు 12 కోట్ల మంది మొదటిసారిగా వ్యాపారంలో ప్రవేశించేందుకు ఈ లోన్స్ ఎంతగానో ఉపయోగపడ్డాయి. లోన్స్ తిరిగి చెల్లించే స్కీములో ఇది అగ్రస్థానంలో ఉందని చెప్పాలి. కేవలం 2.3 శాతం మొండి బాకీలు మాత్రమే ఇందులో ఉన్నాయి. ముద్ర లోన్స్ పొందేందుకు మీ సమీపంలో ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్, గ్రామీణ, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులకు కూడా వెళ్ళవచ్చు.
మీరు కేంద్ర ప్రభుత్వం అధికారిక ఉద్యమ్ మిత్ర పోర్టల్ లేదా జన సమర్థ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో ఈజీగా దరఖాస్తు చేసుకోవచ్చు. మీ దగ్గరలో ఉన్నటువంటి బ్యాంకు శాఖను సందర్శించి ముద్ర లోన్ అప్లికేషన్ ఫారం సమర్పించడంతో పాటు ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఓటర్ ఐడి, అలాగే బిజినెస్ ప్లాన్ కు సంబంధించి ప్రాజెక్ట్ రిపోర్ట్ అలాగే పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు అందించాల్సి ఉంటుంది. లోన్ మంజూరైన తర్వాత మీకు ముద్రకార్డు రూపంలో డిబేట్ కార్డ్ అందిస్తారు. దీని ద్వారా మీరు ఎప్పుడు అవసరమైతే అప్పుడు డబ్బులు ఉపయోగించుకునే ఛాన్స్ ఉంటుంది. మీరు ఎంత డబ్బు వాడుకుంటారో దానిపై మాత్రమే వడ్డీ పడుతుంది.
Disclaimer: ఈ కథనంలో పొందుపరిచిన సమాచారం కేవలం సాధారణ అవగాహన కోసం మాత్రమే. ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ పెట్టుబడి, ఆర్థిక, వ్యాపార లేదా న్యాయ సలహాగా పరిగణించరాదు. ఇందులోని వివరాలు ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా సేకరించబడ్డాయి. సమాచార ఖచ్చితత్వంపై జీ తెలుగు న్యూస్ ఎలాంటి హామీ ఇవ్వదు. ఈ సమాచారాన్ని ఆధారంగా చేసుకుని తీసుకునే పెట్టుబడి లేదా ఇతర ఆర్థిక నిర్ణయాలకు సంబంధించి కలిగే లాభనష్టాలకు పూర్తిగా పాఠకులే బాధ్యులు. ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు అర్హత కలిగిన ఆర్థిక సలహాదారులను సంప్రదించడం మంచిది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.