పొదరిల్లు సీరియల్లో ఈ వారం అంతా ఇంట్రెస్టింగ్ సీన్స్ జరుగుతూ వచ్చాయి. ఏ ఎపిసోడ్ కూడా బోరింగ్గా అనిపించకపోవచ్చు. మహాలక్ష్మీకి జాబ్ రావడం, మరో వైపు కన్నా కన్నతల్లి మహాకి కనిపించడం, నారాయణ నుంచి
నిజాన్ని రాబట్టేందుకు మహాలక్ష్మీ ప్రయత్నించడం ఇలా అన్నీ కూడా ఇంట్రెస్టింగ్ సీన్లతో నడిచాయి. మరో వైపు మహా కోసం ఓ కొత్త వాష్ రూంని కట్టించేందుకు మాధవ, భన్సీ కలిసి పనులు ప్రారంభించారు. ఇవన్నీ ఇలా ఉంటే ప్రతీ సందర్భంలోనూ చక్రిని దూరం పెడుతున్నట్టుగానే కనిపిస్తోంది మహాలక్ష్మీ.చక్రి ఏ ప్రశ్న అడిగినా సెటైరికల్గానే సమాధానం చెబుతూ వస్తోంది మహా. అసలు జాబ్ వచ్చిన తరువాత మరింతగా మాట్లాడటం మానేసినట్టు అనిపిస్తుంది. కన్నాతో పాటుగా బస్సులోనే వెళ్తాను అని మహా చెబుతోంది. చక్రికి పికప్ అండ్ డ్రాప్ చేసే టైంలోనే మహాతో మాట్లాడే టైం దొరుకుతుంది. ఇక ఇప్పుడు అది కూడా మిస్ అయింది. మరి చక్రి తన ప్రేమను ఎలా ముందుకు తీసుకు వెళ్తాడో చూడాలి. ఇక నిన్నటి ఎపిసోడ్లో అయితే మహాలక్ష్మీ ఆఫీసుకి వెళ్లి చక్రి నానా బీభత్సం చేశాడు. అందరి ముందు ఓ రౌడీలా చక్రి ప్రవర్తించాడు. సంతోష్ కుమార్ అయితే చక్రి పరువుతీశాడు. ఇలాంటివి ఏమైనా ఉంటే బయట చూసుకోవాలని మహాకి వార్నింగ్ ఇచ్చాడు.చక్రి అలా ఆఫీసుకి రావడంతో మహాకి తలకొట్టేసినట్టు అయింది. అసలే ఆఫీసులో తనకు పెళ్లి కాలేదని అబద్దం చెప్పేసింది మహా. మరి ఈ చక్రి ఎవరు అని అడిగితే మహా అక్కడ ఏ సమాధానం చెబుతుందో చూడాలి. ఇంటికి వచ్చిన తరువాత మహా, చక్రికి మధ్య ఎలాంటి గొడవ జరుగుతుందో మరి. ఇంకో వైపు కేశవ తన తప్పు తెలుసుకుంటాడు. శైలుకి సారీ చెప్పాలని ప్రయత్నిస్తుంటాడు. కానీ శైలు మాత్రం తీవ్రంగా హర్ట్ అయినట్టుంది. కేశవ కనిపించినా మొహం తిప్పుకుని వెళ్తోంది. కేశవ మాట్లాడాలని ప్రయత్నిస్తూ కూడా దూరం జరుగుతోంది.ఇంకో వైపు లక్కీ లక్కీ అంటూ మహాలక్ష్మీ బాస్ విక్కీ పిలుస్తూనే ఉన్నాడు. మహా ఏమో అలా పిలవొద్దు అని అంటోంది. విక్కీ మాత్రం వినడం లేదు. చూస్తుంటే భవిష్యత్తులో విక్కీ, లక్కీ ట్రాక్ కూడా పట్టాలెక్కేలా కనిపిస్తోంది. లక్కీ ప్రేమలో విక్కీ పడేలా ఉన్నాడు. మరి అప్పుడు మహాలక్ష్మీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి. ఇంకో వైపు మాధవ కోసం మనీషా అనే కారెక్టర్ను తీసుకు వచ్చినట్టుగా కనిపిస్తోంది.