
భారత వర్షాకాలాన్ని ప్రభావితం చేసే కీలక వాతావరణ పరిణామమైన ఎల్నినో మళ్లీ పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడిందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ప్రకటించింది. ప్రస్తుతం కొనసాగుతున్న నైరుతి రుతుపవనాల కాలంలో ఈ
ప్రభావం మరింత బలపడే అవకాశం ఉందని హెచ్చరించింది. దీంతో దేశవ్యాప్తంగా వర్షపాతం, వ్యవసాయం, నీటి లభ్యతపై ప్రతికూల ప్రభావం పడనుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.ఐఎండీ విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం భూమధ్యరేఖా పసిఫిక్ ప్రాంతంలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయిని మించి పెరగడంతో ఎల్నినో పరిస్థితులు అధికారికంగా ప్రారంభమయ్యాయి. వాతావరణ వ్యవస్థల్లో కూడా ఈ మార్పుల ప్రభావం కనిపించడం ప్రారంభమైందని తెలిపింది. రాబోయే నెలల్లో ఈ పరిస్థితులు మరింత తీవ్రరూపం దాల్చే అవకాశముందని అంచనా వేసింది.పసిఫిక్ మహాసముద్రంలోని మధ్య, తూర్పు ప్రాంతాల్లో సముద్ర జలాలు అసాధారణంగా వేడెక్కే సహజ వాతావరణ ప్రక్రియే ఎల్నినో. భారతదేశంలో ఇది అత్యంత కీలకమైన అంశంగా పరిగణిస్తారు. ఎందుకంటే గతంలో ఎల్నినో ప్రభావం ఉన్న సంవత్సరాల్లో సాధారణ కంటే తక్కువ వర్షపాతం నమోదవడం, వ్యవసాయ ఉత్పత్తి తగ్గడం వంటి పరిస్థితులు ఎదురయ్యాయి.ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ, ఎల్నినో ప్రభావానికి గురయ్యే అత్యంత సున్నితంగా ఉన్న 197 జిల్లాలను గుర్తించామన్నారు. వాటి కోసం రాష్ట్రాలవారీగా ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేశామని తెలిపారు. ప్రతి వారం పరిస్థితిని సమీక్షిస్తున్నామని, అవసరమైన విత్తనాలు, వ్యవసాయ సామగ్రిని ముందుగానే నిల్వ చేశామని వెల్లడించారు.రైతుల్లో అవగాహన పెంచేందుకు ‘ఖేత్ బచావో అభియాన్’ పేరుతో