
ఇరాన్ తో జరుగుతున్న యుద్దంలో అమెరికాకు భారత్ (India) టార్గెట్ గా మారుతోంది. హార్ముజ్ జలసంధిలో భారతీయులున్న నౌకల్ని గతంలో వదిలేసిన అమెరికా.. ఇప్పుడు మాత్రం వరుసగా దాడులకు దిగుతోంది. తాజాగా జరిగిన
దాడిలో ముగ్గురు భారతీయ నావికులు ప్రాణాలు కోల్పోవడంతో నిన్న అమెరికా దౌత్యవేత్తకు కే్ంద్రం సమన్లు జారీ చేసింది. అలాగే దీనిపై ప్రతిస్పందన రాకపోవడంతో ఇవాళ మరోసారి దౌత్యవేత్తకు వివరణ ఇవ్వాలని సమన్లు పంపింది.అమెరికా దాడులపై భగ్గుమన్న భారత్..! తీవ్ర హెచ్చరిక..!ఒమన్ తీరంలో 20 మంది భారతీయ సిబ్బందితో ప్రయాణిస్తున్న మరో వాణిజ్య నౌకపై అమెరికా తాజాగా దాడి చేసింది. ఇది నాలుగు రోజుల్లోనే భారతీయ నావికులకు సంబంధించి మూడవ సంఘటన కావడంతో భారత్ ఇవాళ అమెరికా ఛార్జ్ డి అఫైర్స్ జాసన్ మీక్స్‌ను ఈ వారంలో రెండవ సారి పిలిపించింది. గల్ఫ్ ప్రాంతంలో వాణిజ్య నౌకాయానానికి పెరుగుతున్న ముప్పుపై భారత్ తన దౌత్యపరమైన ప్రతిస్పందనను ముమ్మరం చేస్తున్న తరుణంలో, విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA)లోని అమెరికా వ్యవహారాల అదనపు కార్యదర్శి ఈ అమెరికన్ దౌత్యవేత్తను పిలిపించారు. US: అందుకే మిసైళ్లతో దాడి చేశాం-అంగీకరించిన అమెరికా..!వాణిజ్య నౌకలపై జరిగిన వరుస దాడుల నేపథ్యంలో, హార్ముజ్ జలసంధి, ఒమన్ గల్ఫ్, దాని పరిసర జలాల్లో పనిచేస్తున్న దాదాపు 18 వేల మంది భారతీయ నావికుల కోసం డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ షిప్పింగ్ కొత్త సముద్ర భద్రతా సలహాను జారీ చేసిన కొన్ని గంటలకే ఈ తాజా పిలుపులు అందాయి. భారతీయ సిబ్బందితో కూడిన నౌకలకు సంబంధించి తాజాగా జరిగిన మూడు సంఘటనల నేపథ్యంలో ఈ అలర్ట్ జారీ చేశారు. వీటిలో ఒమన్ తీరంలో జరిగిన ఘోరమైన దాడిలో ముగ్గురు భారతీయ నావికులు ప్రాణాలు కోల్పోయారు.