
రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్, లైఫ్స్టైల్, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా
సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.
NTA Guidelines of RE-NEET UG Exam 2026: గతంలో అభ్యర్థుల నుండి వచ్చిన విమర్శలను దృష్టిలో ఉంచుకుని, ఎన్టీఏ కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో పేపర్ లీకేజీ సమస్యల కారణంగా 2026 మే 13న నీట్ పరీక్షను రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మళ్లీ జూన్ 21వ తేదీన ఈ రీఎగ్జామ్ నిర్వహించనున్నారు. పరీక్షా ప్రక్రియను మరింత సులభతరం చేస్తూ, సమయం, రఫ్ వర్క్ పేజీలు ,ప్రశ్నాపత్రం రూపకల్పనకు సంబంధించి ఎన్టీఏ కొత్త నిబంధనలను ప్రకటించింది.
పరీక్షా సమయం పెంపు... అభ్యర్థులకు ఒక శుభవార్త ఏంటంటే, నీట్ పరీక్షా వ్యవధిని పెంచారు. ఈ పరీక్ష 195 నిమిషాల పాటు సాగుతుంది. 2026 జూన్ 21న మధ్యాహ్నం 2:00 గంటల నుండి సాయంత్రం 5:15 గంటల వరకు పరీక్ష జరుగుతుంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సూచించిన ఈ కొత్త సమయాన్ని బట్టి అభ్యర్థులు సిద్ధమవ్వాలి. దీనివల్ల ప్రశ్నలకు సమాధానాలు గుర్తించడానికి తగినంత సమయం దొరుకుతుంది, తద్వారా అభ్యర్థుల ఒత్తిడి కూడా తగ్గుతుంది.
పరీక్షకు ముందు జరిగే కొన్ని సాంకేతిక ప్రక్రియల వల్ల అసలు పరీక్షపై ప్రభావం పడుతుందని కొందరు అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో, ప్రామాణిక పద్ధతులను పాటిస్తూనే అభ్యర్థులకు ఇబ్బంది లేకుండా పరీక్షా వేదికను సిద్ధం చేస్తోంది.
క్వశ్చన్ పేపర్ డిజైన్... ప్రశ్నాపత్రంపై రఫ్ వర్క్ చేసుకోవడానికి ఎన్టీఏ అదనపు సౌలభ్యాన్ని కల్పించింది. అభ్యర్థుల అవసరాలను బట్టి రఫ్ వర్క్ పేజీలను రెండు నుండి నాలుగు వరకు పెంచారు. లెక్కలు చేయడానికి లేదా డయాగ్రమ్స్ గీయడానికి ఈ అదనపు పేజీలు ఉపయోగపడతాయి. ముఖ్యంగా, ఈ రఫ్ వర్క్ పేజీలు ప్రశ్నల పుస్తకంలోనే (Question Booklet) ప్రారంభంలో అందుబాటులో ఉంటాయి. గతంలో వీటిని పేపర్ చివరన ఇచ్చేవారు, కానీ ఫీడ్ బ్యాక్ ఆధారంగా ఇప్పుడు ఇన్స్ట్రక్షన్ పేజీల తర్వాతే ఇవి ఉంటాయి. దీనివల్ల అభ్యర్థులు సులభంగా రఫ్ వర్క్ చేసుకోవచ్చు. ఈ మార్పులు ఇంగ్లీష్తో పాటు స్థానిక భాషల్లో ఇచ్చే ప్రశ్నపత్రాలకు కూడా వర్తిస్తాయి.
నీట్ అభ్యర్థులు చేయాల్సిన పనులు.. ఎన్టీఏ చేపట్టిన ఈ మెరుగుదల చర్యల వల్ల అభ్యర్థులు ఏ ఆందోళన లేకుండా పరీక్ష రాయవచ్చు. నిష్పక్షపాతంగా, పూర్తి భద్రతతో నిర్వహిస్తున్నట్లు సంస్థ తెలిపింది. అయితే, విద్యార్థులు తమ అడ్మిట్ కార్డుపై ఉన్న సమాచారాన్ని క్షుణ్ణంగా చదివి, నిబంధనల ప్రకారం పరీక్షా కేంద్రానికి హాజరుకావాలి. పరీక్షా సిబ్బందికి సహకరించాలని ఎన్టీఏ కోరింది. మధ్యాహ్నం 1:30 గంటల తర్వాత పరీక్షా కేంద్రం గేట్లు మూసివేస్తారు, కాబట్టి అభ్యర్థులు ముందుగానే చేరుకోవడం తప్పనిసరి.
ఫోటో గుర్తింపు కార్డు.. పరీక్షకు వెళ్లేటప్పుడు అభ్యర్థులు హాల్ టికెట్తో పాటు ఒక ఒరిజినల్ ఫోటో గుర్తింపు కార్డును తప్పనిసరిగా వెంట తీసుకెళ్లాలి. రీనీట్ 2026 అప్లికేషన్ ఫారమ్లో పేర్కొన్న విధంగా పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, ఓటర్ ఐడి లేదా పాస్పోర్ట్ వంటి వాటిలో ఏదో ఒకటి ఉండాలి. గుర్తింపు కార్డు లేని పక్షంలో పరీక్షా కేంద్రంలోకి అనుమతించరు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.