పశ్చిమాసియా ఉద్రిక్తతలు తగ్గడంతో అంతర్జాతీయ బులియన్ మార్కెట్లో పసిడి ధరలు ఒక్కసారిగా పెరిగాయి. ఈరోజు స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 82 డాలర్ల పైన పెరిగి 4180 డాలర్ల స్థాయికి చేరింది. అలాగే స్పాట్
సిల్వర్ రేటు ఔన్సుకు 3.44 శాతం మేర పెరిగి 66.14 డాలర్ల వద్దకు దూసుకెళ్లింది.
హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధర రెండు రోజుల పతనం తర్వాత పెరిగింది. ఇవాళ 24 క్యారెట్ల మేలిమి గోల్డ్ ధర ఒక్కరోజే ఏకంగా రూ.2940 మేర పెరిగింది. దీంతో 10 గ్రాముల బంగారం రేటు రూ.1,48,580 వద్దకు దూసుకెళ్లింది. అలాగే 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర ఈరోజు తులంపై రూ.2700 మేర పెరిగింది. దీంతో 10 గ్రాములకు రూ.1,36,200 వద్దకు దూసుకెళ్లింది.
బంగారంతో పాటు వెండి ధరలు సైతం భారీగా పెరిగాయి. హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి రేటు క్రితం రోజు స్థిరంగా ఉండగా ఇవాళ ఏకంగా రూ.5000 మేర పెరిగింది. దీంతో కిలో వెండి ధర రూ.2,65,000 మార్క్ వద్దకు దూసుకెళ్లింది.
లలితా జువెలరీల్లోనూ ఈరోజు 22 క్యారెట్ల బంగారం ధరలు పెరిగాయి. 1 గ్రాము బంగారం రేటు రూ. 270 మేర పెరిగింది. దీంతో గ్రాము ధర రూ. 13,620 వద్దకు ఎగబాకింది. ఇక తులం బంగారం చూసుకుంటే రూ.1,36,200 వద్ద ట్రేడవుతోంది.
రచయిత గురించిబండ తిరుపతిబండ తిరుపతి సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్గా పనిచేస్తున్నారు. ఆయనకు జర్నలిజంలో 10 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. 2023లో సమయంలో చేరిన తిరుపతి.. బిజినెస్ రంగానికి సంబంధించి తాజా వార్తలతో పాటు పర్సనల్ ఫైనాన్స్, పెట్టుబడులు, మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్ న్యూస్, బంగారం వెండి ధరలపై ఎప్పటికప్పుడు అప్డేట్లు అందిస్తున్నారు. ఫ్యాక్ట్ చెక్ ఆర్టికల్స్తో పాటు ప్రభుత్వ పథకాలకు సంబంధించిన సమాచారం సైతం ఇస్తున్నారు. బండ తిరుపతి 2025 ఫిబ్రవరిలో టైమ్స్ ఇంటర్నెట్ నుంచి ఓవర్ అచీవర్ ఆఫ్ ది మంత్ అవార్డును అందుకున్నారు. తిరుపతి మండలస్థాయి న్యూస్ కంట్రిబ్యూటర్గా తన జర్నలిజం కెరీర్ను ప్రారంభించారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో మల్టీమీడియా జర్నలిజం కోర్స్ పూర్తి చేశారు. అనంతరం ఈటీవీ భారత్, సాక్షి మీడియా సంస్థల్లో పని చేశారు. అక్కడ బిజినెస్, స్పోర్ట్స్, నేషనల్, ఇంటర్నేషనల్ న్యూస్ రాశారు. 2019 సాధారణ ఎన్నికల సమయంలో ప్రత్యేక కథనాలు అందించిన అనుభవం ఉంది. సినిమాలు, క్రికెట్ చూడటం, బిజినెస్ రంగానికి సంబంధించిన కొత్త విషయాలు నేర్చుకోవడం పట్ల ఆయన ఆసక్తి చూపుతారు.... ఇంకా చదవండి