
అంతర్జాతీయంగా ఎన్నో శాంతి చర్చలు, ఎప్పటికప్పుడు కాల్పుల విరమణ ఒప్పందాలు జరుగుతున్నా కూడా ఇజ్రాయెల్, లెబనాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు చల్లారడం లేదు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్యవర్తిత్వంలో
కుదిరిన ఒప్పందాలను కూడా బేఖాతరు చేస్తూ ఇజ్రాయెల్ సైన్యం లెబనాన్‌లోని హిజ్బుల్లా ఉగ్రవాద స్థావరాలపై విరుచుకుపడుతోంది. తాజాగా ఇజ్రాయెల్ వైమానిక దళం దక్షిణ లెబనాన్‌పై భారీ దాడులతో విరుచుకుపడటంతో అక్కడి సరిహద్దు ప్రాంతాల్లో మరోసారి హాహాకారాలు వ్యక్తమవుతున్నాయి. ట్రంప్ ఇజ్రాయెల్’ వ్యూహం: చిక్కుల్లో పడ్డ పాకిస్తాన్!దక్షిణ లెబనాన్‌లోని ముర్జాయూన్ జిల్లాలో ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేసింది. డిబిన్ నగరం సమీపంలోని వ్యవసాయ ప్రాంతాలను లక్ష్యంగా ఈ దాడి జరిగింది. అదనంగా నబాతియే జిల్లాలోని జెబ్చిత్ గ్రామంపై కూడా ఇజ్రాయెల్ డ్రోన్ దాడి చేసింది. ఈ దాడుల వల్ల జరిగిన నష్టం వివరాలు ఇంకా తెలియలేదు. అయితే, ఈ ఘటనల్లో కొందరు మరణించి ఉండవచ్చని లెబనాన్ మీడియా పేర్కొంది. క్షతగాత్రుల సంఖ్యపై ఇంకా స్పష్టత రాలేదు.నెతన్యాహు సందేశంఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు జూన్ 10న ప్రత్యేక సందేశం ఇచ్చారు. తమ యుద్ధం హిజ్బుల్లాతోనేనని ఆయన స్పష్టం చేశారు. అది లెబనాన్ ప్రజలతో కాదని ఆయన తెలిపారు. హిజ్బుల్లా లెబనాన్‌ను బందీగా మార్చిందని నెతన్యాహు ఆరోపించారు. ఇరాన్ మాట విని హిజ్బుల్లా దాడులు చేస్తోందని ఆయన చెప్పారు. లెబనాన్ పరిస్థితులు తీవ్రంగా దిగజారిపోయాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.వెనక్కి తగ్గేదే లేదు!: అమెరికా కపట నీతిపై జైశంకర్ ఫైర్!దాదాపు 10 వేల మంది హిజ్బుల్లా ఉగ్రవాదులను హతమార్చామని నెతన్యాహు తెలిపారు. ఇజ్రాయెల్ గతంలో కంటే చాలా బలంగా మారిందని ఆయన చెప్పారు. ఉగ్రవాదులను ఏరివేసేందుకు గాలింపు కొనసాగుతోంది. లెబనాన్‌తో శాంతిని కోరుకుంటున్నామని నెతన్యాహు వెల్లడించారు. శాంతికి హిజ్బుల్లా మాత్రమే అడ్డంకి అని ఆయన విమర్శించారు. భవిష్యత్తు బాగుండాలంటే ఆ ఉగ్రవాదులను నమ్మవద్దని ఆయన ప్రజలకు సూచించారు.