
చివరగా, అశ్వత్ మారిముత్తు దర్శకత్వంలో తలైవా 173 పట్టాలెక్కడం ఖరారైంది. ఇప్పటికే సినిమా సెట్ వర్క్ ప్రారంభమైంది. జైలర్ 2 షూటింగ్ పూర్తయైన వెంటనే ఈ సినిమా చిత్రీకరణ మొదలవుతుంది. ఈ సినిమా కథ విషయంలో ఒక
ఆసక్తికర చర్చ జరుగుతోంది. రజినీకాంత్ ఇందులో ఐదు రూపాయల డాక్టర్ పాత్రలో కనిపించనున్నారని తాజా సమాచారం. అయితే, జై భీమ్ దర్శకుడు టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఇదే ఐదు రూపాయల డాక్టర్ కథతో సూర్య కూడా ఒక సినిమా ప్లాన్ చేస్తున్నారు. దీంతో రజినీకాంత్ ప్రాజెక్ట్, సూర్య ప్రాజెక్ట్ మధ్య ఒకే కథ అనే అంశం డైలమాలో పడింది. ఈ విషయంలో మరింత స్పష్టత రావాలంటే అధికారిక ప్రకటన వెలువడే వరకు వేచి చూడాలి.
బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపిస్తున్న బయోపిక్స్
ఐమ్యాక్స్ ఐమాక్స్ కోసం ఆ రేట్లు తప్పవా..?
మహిళల కోసం ట్రిప్స్.. ఎందుకో చెప్పిన కమల్ హాసన్ మేనకోడలు