
దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్లో సీనియర్ కంటెంట్ ఎడిటర్గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్టైన్మెంట్, బిజినెస్
, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు.
Indian Sailors Died In Oman: ఒమన్ తీరంలోని భారత నౌకపై అమెరికా దాడి చేసింది. ఈ దాడిపో ముగ్గురు భారతీయ నావికులు మృతి చెందినట్లు తెలుస్తోంది. ఇరాన్ చమురుపై కొనసాగుతున్న దిగ్బంధనాన్ని ఉల్లంఘించిందనే ఆరోపణలతో, ఒమన్ తీరంలో పలావు జెండా కలిగిన చమురు ట్యాంకర్పై అమెరికా సెంట్రల్ కమాండ్ అత్యంత కచ్చితమైన ఆయుధాలతో దాడి చేయడంతో ఈ ప్రాణనష్టం జరిగింది.
ఈ వారం ప్రారంభంలో ఒమన్ తీరంలో అమెరికా దళాలు ఒక నౌకపై దాడి చేయడంతో, మొదట గల్లంతైనట్లుగా భావించిన ముగ్గురు భారతీయ నావికులు మరణించారని షిప్పింగ్ మంత్రి సర్బానంద సోనోవాల్ తెలిపారు. దీనిని ఒక "విషాదకరమైన" నష్టంగా అభివర్ణిస్తూ, గల్లంతైన ముగ్గురు నావికుల మృతదేహాలను వెలికితీసినట్లు మంత్రి చెప్పారు.
ఒమన్ గల్ఫ్లో అమెరికా సైన్యం దాడికి గురైనప్పుడు, పలావు జెండా కలిగిన 'సెట్టెబెల్లో' అనే చమురు ట్యాంకర్లో 24 మంది భారతీయులు, నలుగురు విదేశీయులతో సహా మొత్తం 28 మంది సిబ్బంది ఉన్నారు. వీరిలో ఇద్దరు పాకిస్థానీలు, ఒక ఉక్రేనియన్, ఒక రష్యన్ ఉన్నారు. తమ ఆదేశాలను పాటించడంలో విఫలమైందని, ఇరాన్ నుండి చమురును తీసుకువస్తోందని ఆరోపిస్తూ ఆ నౌకపై దాడి చేసినట్లు అమెరికా సైన్యం తెలిపింది.
ఓడ నుంచి 21 మంది భారతీయ నావికులను రక్షించినప్పటికీ.. డెక్ క్యాడెట్ ఆదిత్య శర్మ, ఇంజన్ ఫిట్టర్ శివానంద్ చౌరాసియా, చీఫ్ ఇంజనీర్ పట్నాల సురేష్ అనే ముగ్గురు నావికులు గల్లంతయ్యారని తొలుత వార్తలు వచ్చాయి.
"ఇది మన సముద్రయాన కుటుంబానికి తీరని లోటు. ఈ కష్ట సమయంలో మోదీ ప్రభుత్వం మృతుల కుటుంబాలకు అండగా నిలుస్తుంది. వారి కుటుంబ సభ్యులకు మద్దతు ఇవ్వడానికి పూర్తిగా కట్టుబడి ఉంది. దాడి నుంచి బయటపడిన సిబ్బందితో పాటు మృతదేహాలను వెంటనే స్వదేశానికి రప్పించాలని.. మృతుల పార్థివ దేహాలను అంత్యక్రియల కోసం త్వరతగతిన తీసుకురావాలని అధికారులను ఆదేశించాను" అని షిప్పింగ్ మంత్రి సరస్బానంద సోనోవాల్ తెలిపారు.
దాడిపై భారత్ ఖండన.. నౌకలోని మిగిలిన నావికులతో స్థిరమైన నెట్వర్క్ కనెక్షన్ను ఏర్పాటు చేయడంలో నౌక యాజమాన్య సంస్థ ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఇరాన్ చమురుపై కొనసాగుతున్న దిగ్బంధనాన్ని ఉల్లంఘించిందనే ఆరోపణలతో, ఒమన్ తీరంలో ఒక చమురు ట్యాంకర్పై అమెరికా సెంట్రల్ కమాండ్ దళాలు అత్యంత కచ్చితమైన క్షిపణులతో దాడి చేయడంతో ఈ ప్రాణనష్టం జరిగింది. హోర్ముజ్ను దాటేందుకు ఆ నౌక ప్రయత్నించగా, అమెరికా నౌకాదళం జరిపిన దాడిలో 24 మంది భారతీయులు మరణించారని భారత్ ఈ ఘటనను ఖండించింది.
భారత్ నిరసన.. ఈ దాడిపై "తీవ్ర నిరసన" తెలియజేయడానికి భారత్, న్యూఢిల్లీలోని వాషింగ్టన్ రాయబార కార్యాలయ అధికారుల్ని పిలిపించిందని ఒక సీనియర్ భారత ప్రభుత్వ అధికారి ఏఎఫ్పీ వార్తా సంస్థకు తెలిపారు. ప్రపంచ ఇంధన సరఫరాలకు కీలకమైన జలమార్గమైన గల్ఫ్లోని హోర్ముజ్ జలసంధి, ఫిబ్రవరి చివరిలో ఇరాన్పై అమెరికా-ఇజ్రాయెల్ దాడులతో ప్రారంభమైన మధ్యప్రాచ్య యుద్ధం మొదలైనప్పటి నుండి దాదాపు పూర్తిగా దిగ్బంధించారు.
ఇటీవలి వారాలుగా అమల్లో ఉన్న కాల్పుల విరమణ సమయంలో జరిగిన చర్చలు, ఈ జలసంధిని తిరిగి తెరిచే ఒప్పందాన్ని కుదర్చడంలో విఫలమయ్యాయి. యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి ఇరాన్ ఈ నౌకా రవాణా మార్గాన్ని దిగ్బంధించగా, ఏప్రిల్ నుండి అమెరికా కూడా దానికి పోటీగా తనదైన దిగ్బంధనాన్ని అమలు చేస్తోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.