
Mahabubnagar news: పేదోడి నడ్డీ విరుస్తున్న బిజేపిని గద్దేదించాలని పిలుపునిచ్చారు ప్రభుత్వ విప్ యెన్నం శ్రీనివాస్ రెడ్డి టి పిసిసి పిలుపు మేరకు జిల్లా కేంద్రంలోని అశోక్ టాకీస్ చౌరస్తా వద్ద గల గాంధీ
విగ్రహం వద్ద మహాధర్నా కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరైయ్యారు. అంతకుముందు ఆర్టీసీ బస్టాండ్ దగ్గర అంబెడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. పాదయాత్ర గా అశోక్ టాకీస్ వరకు దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సంజీవ్ ముదిరాజ్ తో పాటు స్థానిక నాయకులు కార్యకర్తలతో కలిసి మహాధర్నాలో పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ ధర్నా ఒక్కరోజు కార్యక్రమం మాత్రమే కాదు, ఇది నిరంతర పోరాటానికి నాంది కావాలన్నారు. ఈ రోజు దేశంలో ఒక చేతగాని ప్రభుత్వం కొనసాగుతోందని, విదేశీ ఒత్తిడులకు లోనై, ప్రజల సమస్యలను పట్టించుకోని పాలన సాగుతోందని ఆరోపించారు . దేశ ప్రజలను బాధల్లోకి నెట్టే విధంగా బిజేపి ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుందని అన్నారు. నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని అందుకుంటున్నాయని, పెట్రోల్, డీజిల్ ధరలు సామాన్య ప్రజల్ని నలిపేస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో మన్మోహన్ సింగ్ నాయకత్వంలో, సోనియా గాంధీ మార్గదర్శకత్వంలో, అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు ఎక్కువగా ఉన్నప్పటికీ ప్రజలపై భారం పడకుండా కాంగ్రెస్ ప్రభుత్వం సమర్థవంతంగా పాలన సాగించింది అని అన్నారు.
Read also: Hyderabad Crime: మల్కాజ్గిరిలో దారుణం.. భార్య ప్రవర్తనపై అనుమానంతో కాల్చి చంపిన భర్త!
కానీ ఇప్పుడు అనుభవం లేని పాలన కారణంగా ప్రజలపై భారాలు పెరుగుతున్నాయి. మతాలు, కులాల మధ్య విభేదాలు పెంచి అధికారంలోకి వచ్చిన ఈ ప్రభుత్వం దేశాన్ని సరైన దిశలో నడపలేకపోతోందని అన్నారు. పన్నెండు సంవత్సరాల పాలన తర్వాత కూడా ప్రజల సమస్యలకు సరైన పరిష్కారాలు చూపలేకపోతున్నారని, మధ్యతరగతి, పేదవర్గాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయని, ఉపాధి అవకాశాలు తగ్గిపోయాయి. ధరల భారం పేదవాడి పైన పెరిగిపోయిందన్నారు. ఈ పరిస్థితిని మార్చాల్సిన బాధ్యత మనందరి పైన ఉందని, 2004లో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఇచ్చిన మద్దతుతో మార్పు వచ్చినట్టే, ఇప్పుడు కూడా మనం కలిసి పనిచేయాలని సూచించారు. గ్రామ గ్రామానికి, బస్తీ బస్తీకి వెళ్లి ప్రజలకు నిజాలు తెలియజేయాలని, ఈ ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను బహిర్గతం చేయాలని చెప్పారు. దేశానికి సమతుల్యమైన నాయకత్వం అవసరం ఉందని అందరినీ సమానంగా చూసే నాయకుడు అవసరం ఎంతైనా ఉందని, ఆ దిశగా రాహుల్ గాంధీ గారికి అవకాశం ఇవ్వాల్సిన సమయం ఇప్పుడు వచ్చిందన్నారు. ఒకే వ్యక్తికి పదే పదే అధికారం ఇవ్వడం వల్ల అభివృద్ధి ఆగిపోతుందని, ప్రపంచ దేశాల్లో కూడా పరిమిత కాలం మాత్రమే నాయకత్వం ఇస్తారన్నారు. మన దేశంలో కూడా మార్పు అవసరం ఉందని, ఈ రోజు ప్రారంభమైన ఈ ఉద్యమం రాబోయే రోజుల్లో మరింత బలపడాలి. పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ ఏకతాటిపైకి వచ్చి పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ బెక్కెరి అనిత మధుసూదన్ రెడ్డి, నగర్ మేయర్ గుమ్మాల మమత శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ మారే పల్లి సురేందర్ రెడ్డి, డిసిసి నాయకులు బుద్దారం సుధాకర్ రెడ్డి, సత్తూర్ చంద్రకుమార్ గౌడ్, సాయిబాబా, రాములు యాదవ్, సిజె బెనహర్, రాజు భాయి, ఫయాజ్, యూత్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అవేజ్, పట్టణ కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వహక అధ్యక్షులు అజ్మత్ అలి, నగర కార్పొరేటర్లు హన్వాడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వి మహేందర్ తదితరులు పాల్గొన్నారు.
Flight ticket price: విమాన టికెట్ ధరలు 10% పెంపు!
గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.
Heavy Rain in Hyderabad : భారీ వర్షంతో ట్రాఫిక్ నరకం..ఇబ్బంది పడ్డ ఉద్యోగులు
Hyderabad Crime: మల్కాజ్గిరిలో దారుణం.. భార్య ప్రవర్తనపై అనుమానంతో కాల్చి చంపిన భర్త!
Narendra Modi: 2047 వరకు మోదీనే ప్రధానిగా ఉండాలన్న బండి సంజయ్!
Bellampalli Development: బెల్లంపల్లి అభివృద్ధికి సింగరేణి సహకారం కోరిన ప్రతినిధులు
Medak district: రామోజిపల్లిలో మద్యం విక్రయిస్తే ఫైన్ ..పట్టిస్తే రూ.5 వేల రివార్డ్
Revanth Reddy: మీనాక్షి నటరాజన్ పై తెలంగాణలో ఎలాంటి కేసులు లేవు: సీఎం రేవంత్ రెడ్డి