
దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్లో సీనియర్ కంటెంట్ ఎడిటర్గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్టైన్మెంట్, బిజినెస్
, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు.
Khammam Bus Accident: ఖమ్మం జిల్లాలో ఆదివారం అర్ధరాత్రి ఒక ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పెనుబల్లి మండలం కొత్తలంక పల్లి రైల్వే వంతెన పై కెవిఆర్ ట్రావెల్స్ కు చెందిన బలంగా ఢీ కొట్టి, తర్వాత రోడ్డుపై కొలతలు పడింది. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 36 మంది ప్రయాణికులు ఉన్న సమాచారం.
అతివేగమే ప్రమాదానికి కారణమా? ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు జిల్లా ముసునూరు మండలం చెక్కపల్లి గ్రామం (నూజివీడు సమీపం) నుంచి ఈ బస్సు హైదరాబాదుకు బయలుదేరింది. బస్సులో ధర్మాజీగూడెం, అక్కిరెడ్డిగూడెం, లింగపాలెం, రాఘవాపురం, సత్తుపల్లి తదితర ప్రాంతాలకు చెందిన ప్ర యాణి ఈ బస్సులో ఉన్నట్లు తెలుస్తుంది. అయితే బస్సు అతివేగం గా ప్రయాణించడం వల్ల అదుపుతప్పి రైల్వే బ్రిడ్జిపై ఉన్న డివైడర్ను ఢీ కొట్టినట్టు ప్రాథమిక సమాచారం ద్వారా తెలుస్తుంది.
క్షతగాత్రుల వివరాలు.. ప్రమాదంలో నలుగురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడగా మరికొందరు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. గాయపడిన వారు ఎం శిరీష, ఏమి శివ గణేష, మల్లిక సత్తుపల్లికి చెందినవారు. అలాగే చెక్కపల్లి కి చెందిన శ్రీనివాసరావు, పావని.. రాఘవ పురానికి చెందిన సుష్మిత, యువన్.. విజయరాయికి చెందిన ప్రణీత్, స్వప్న, నరసింహ.. లింగాపాలెం కి చెందిన తాతిన బాలాజీ.. అలాగే కొంచెం పత్తికి చెందిన రామకృష్ణ వంటి వారు గాయాల పాలయ్యారు. క్షతగాత్రులందరినీ ఆసుపత్రికి తరలించగా వారికి ప్రాణాపాయం తప్పిందని.. ప్రస్తుతం వారి ఆరోగ్యం సురక్షితమైన వైద్యులు ధ్రువీకరించారు.
సకాలంలో స్పందించిన స్థానికులు.. ప్రమాదం జరిగిన వెంటనే కొత్తలంక పల్లి గ్రామస్తులు అప్రమత్తమే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. బసవదాలను పగలగొట్టి లోపల చిక్కుకున్న ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీశారు. అనంతరం అంబులెన్స్ ద్వారా గాయపడిన వారిని సత్తుపల్లి, పెనుబల్లి ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించారు.
ఈ ప్రమాదం కారణంగా రైల్వే వంతెన పై సుమారు అరగంట పాటు భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగి ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ప్రమాదం ఎలా జరిగిందనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.