
తమిళనాడు భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో అంతర్గత సంక్షోభం మరింత తీవ్రతరమవుతోంది. మాజీ రాష్ట్ర అధ్యక్షుడు కె. అన్నామలై రాజీనామా ఉదంతం మరవకముందే, పార్టీకి మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్ర
కార్యదర్శి హోదాలో ఉన్న సుమతి వెంకటేష్ శుక్రవారం తన పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఎంతో ఆవేదనతో, భారమైన హృదయంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె వెల్లడించారు.ఈ మేరకు సోషల్ మీడియా వేదిక 'ఎక్స్'లో ఆమె ఒక పోస్ట్ చేశారు. "రాష్ట్ర కార్యదర్శిగా పార్టీకి సేవ చేయడం గర్వంగా భావిస్తున్నాను. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వం, పార్టీ సిద్ధాంతాలు నాకు ఎల్లప్పుడూ స్ఫూర్తిదాయకం. నా రాజీనామాను ఆమోదించి, బాధ్యతల నుంచి విముక్తి కల్పించాలని కోరుతున్నాను" అని ఆమె తన పోస్టులో పేర్కొన్నారు.కాగా, కొద్ది గంటల వ్యవధిలోనే మాజీ రాష్ట్ర అధ్యక్షుడు కె. అన్నామలై, రాష్ట్ర ఉపాధ్యక్షుడు కరు నాగరాజన్ రాజీనామాలను బీజేపీ జాతీయ నాయకత్వం ఆమోదించింది. వీరి బాటలోనే సుమతి వెంకటేష్ సైతం పార్టీని వీడటం గమనార్హం.2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పార్టీలో అంతర్గత విభేదాలు ఒక్కసారిగా బయటపడ్డాయి. ముఖ్యంగా అన్నాడీఎంకేతో పొత్తు వ్యూహాలు, తనను రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తప్పించడంపై అన్నామలై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇదే సమయంలో నటుడు విజయ్ స్థాపించిన 'తమిళగ వెట్రి కళగం' (టీవీకే) పార్టీ సైతం రాజకీయంగా ప్రభావం చూపుతుండటంతో బీజేపీలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.అయితే, అన్నామలై నిష్క్రమణతో పార్టీకి ఎటువంటి నష్టం లేదని ప్రస్తుత రాష్ట్ర