
జనసేన పార్టీ తరఫున రాజ్యసభ అభ్యర్థిగా పారిశ్రామికవేత్త లింగమనేని రమేష్ ఎంపికయ్యారు. ఈ సందర్భంగా ఆయన జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్కు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. తన అభ్యర్థిత్వానికి
జనసేన పార్టీ తరఫున రాజ్యసభ అభ్యర్థిగా పారిశ్రామికవేత్త లింగమనేని రమేష్ ఎంపికయ్యారు. ఈ సందర్భంగా ఆయన జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్కు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. తన అభ్యర్థిత్వానికి మద్దతు తెలిపిన ఎన్డీయే పెద్దలు ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.ఈ అభ్యర్థిత్వంపై లింగమనేని రమేష్ స్పందిస్తూ, "పవన్ కల్యాణ్ గారు నాకు పదవి కాదు, బలమైన బాధ్యతను అప్పగించారు. ప్రజల ఆకాంక్షలకు తగ్గట్టుగా రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేస్తాను" అని హామీ ఇచ్చారు. రాజ్యసభలో సాధారణ పౌరుడి గొంతును వినిపించడమే తన లక్ష్యంగా పనిచేస్తానని ఆయన స్పష్టం చేశారు.జనసేన అధినేత పవన్ కల్యాణ్ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని లింగమనేని రమేష్ పేర్కొన్నారు. కూటమి తరఫున తనను ఎంపిక చేయడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.