
రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్, లైఫ్స్టైల్, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు.
గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.
Ali Khamenei Funeral At Imam Reza: ఇరాన్ దివంగత సుప్రీం నాయకుడు అయతుల్లా అలీ ఖమేనీ చివరి కోరిక ఎట్టకేలకు నెరవేరబోతోంది. ఫిబ్రవరిలో ఇరాన్, అమెరికా మధ్య జరిగిన యుద్ధంలో వైమానిక దాడుల కారణంగా ఆయన ప్రాణాలు విడిచారు. నాలుగు నెలల తర్వాత, జూలై 9వ తేదీన ఆయన అంత్యక్రియలను అధికారికంగా నిర్వహించనున్నారు. ఇస్లాంలో అత్యంత పవిత్రమైన ప్రదేశాలలో ఒకటైన ఇమామ్ రెజా సమీపంలో, ఆయన స్వస్థలమైన మషాద్లో జూలై 9న ఆయనను ఖననం చేస్తున్నారు.
ఆయనను మషాద్లో ఖననం చేయడానికి ఒక ప్రత్యేక కారణం ఉంది. మరణానంతరం తన భౌతిక కాయాన్ని ఇమామ్ నీడలో ఖననం చేయాలని ఆయన చాలా కాలం క్రితమే కోరుకున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో, శుక్రవారం నుంచి ఆయన ఆరు రోజుల అంత్యక్రియల ఊరేగింపు ప్రారంభమైంది. సంతాపం తెలియజేయడానికి లక్షలాది మంది ప్రజలు టెహ్రాన్లోని గ్రాండ్ మొసల్లా మత సముదాయానికి తరలివచ్చారు. ఖమేనీ పార్థివ కాయాన్ని చూడటానికి భారీ సంఖ్యలో జనం రావడంతో అక్కడ రోదనలు మిన్నంటుతున్నాయి. ఈ కార్యక్రమాలు మొత్తం వారం రోజుల పాటు నిర్వహించనున్నారు. ప్రపంచ దేశాల ప్రతినిధులకు కూడా ఆహ్వానం పంపారు. భారత్ తరపున కేంద్ర విదేశాంగ మంత్రి, బీహార్ గవర్నర్ సయ్యద్ పాల్గొంటారు.
ఇరాక్లో ఎందుకు? అలీ ఖమేనీ కోరిక మేరకు ఈ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ముస్లింలకు పవిత్రమైన మక్కా, మదీనా తర్వాత నజాఫ్, కర్బలాల ప్రాముఖ్యత ఎంతో ఉంది. ఈ ప్రాంతాలు ఇరాక్లో ఉండటంతో అక్కడి ప్రభుత్వం కీలక పాత్ర పోషిస్తోంది. ఇరాన్లోని మషాద్లో ఖమేనీ భౌతిక కాయాన్ని ఉంచుతారు. ఇరాన్ సంస్కృతిలో ఇమామ్ రెజా దయ, ఆశకు గొప్ప ప్రతిరూపంగా పరిగణించబడతారు. మషాద్ నగరం ప్రపంచవ్యాప్తంగా ఉన్న షియా ముస్లింలకు ప్రధాన విశ్వాస కేంద్రం. ఖమేనీ తన ఖననం మషాద్లో జరగాలని కోరడంతో, ఇరాన్ ప్రభుత్వం ఇప్పుడు ప్రభుత్వ లాంఛనాలతో ఆయన కోరికను నెరవేరుస్తోంది.
ఈ అంత్యక్రియలు అత్యంత చారిత్రాత్మకంగా మారనున్నాయి. జూలై 3వ తేదీ నుండి ప్రపంచ నలుమూలల నుండి ప్రతినిధులు వచ్చి నివాళులు అర్పిస్తారు. ఖమేనీ పార్థివ దేహాన్ని సందర్శనార్థం టెహ్రాన్లోని గ్రాండ్ మొసల్లాలో ఉంచుతారు. జూలై 9న తుది ప్రయాణం ముగిసి, ఆయనతో పాటు మరణించిన కుటుంబ సభ్యులను కూడా మషాద్లోని ఇమామ్ సమీపంలో ఖననం చేస్తారు. అలీ ఖమేనీ మరణ వార్త మార్చి 1న ప్రపంచవ్యాప్తంగా తెలిసింది. డోనాల్డ్ ట్రంప్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించడమే కాకుండా, ఖమేనీని చరిత్రలోనే అత్యంత చెడ్డ వ్యక్తిగా పేర్కొన్నారు. ఈ మరణంతో ఇరాన్ పౌరులకు, అమెరికన్లకు, బాధిత దేశాలకు న్యాయం జరిగిందని, ఇరాన్ను తిరిగి స్వాధీనం చేసుకోవడానికి పౌరులకు ఇది పెద్ద అవకాశం అని ట్రంప్ వ్యాఖ్యానించారు.
ప్రధాని మోదీకి ఇరాన్ ఆహ్వానం: ఫిబ్రవరిలో ఇజ్రాయిల్ దాడుల వల్ల జరిగిన యుద్ధం కారణంగా, మార్చిలో అనుకున్న అంత్యక్రియలు జరగలేకపోయాయి. ప్రస్తుతం జూలైలో ఊరేగింపు , ఖనన కార్యక్రమాలు చేపట్టనున్నారు. భారత ప్రధాని నరేంద్ర మోదీకి కూడా ఈ అంత్యక్రియలలో పాల్గొనాలని ఇరాన్ అధ్యక్షుడు ఆహ్వానం పంపారు. అయితే, మోదీ ఈ అంత్యక్రియలకు హాజరుకావడం లేదు. ఆయన న్యూజిలాండ్, ఇండోనేషియా, ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న కారణంగా హాజరుకావడం లేదని సమాచారం.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.