
ప్రముఖ నిర్మాత అభిషేక్ నామా దర్శకత్వం వహించిన లేటెస్ట్ మూవీ `నాగబంధం`. విరాట్ కర్ణ, నభా నటేష్, ఐశ్వర్య మీనన్ హీరోహీరోయిన్లుగా నటించారు. అనసూయ, రిషబ్ సాన్వీ, జగపతిబాబు వంటి వారు
ఇతర పాత్రలు పోషించారు. అభిషేక్ పిక్చర్స్, నిక్ స్టూడియోస్ బ్యానర్పై కిషోర్ అన్నపురెడ్డి, నిశిత నాగిరెడ్డి ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించారు. టీజర్, ట్రైలర్ తో ఆకట్టుకున్న ఈ మూవీ భారీ అంచనాల మధ్య శుక్రవారం ఆడియెన్స్ ముందుకు వచ్చింది. కానీ ఆడియెన్స్ నుంచి దీనికి నెగటివ్ టాక్ వచ్చింది. విజువల్స్ బాగున్నాయి, కానీ సినిమాలో విషయం లేదనే టాక్ వినిపించింది.
భారీ అంచనాలతో వచ్చిన ఈ మూవీకి కలెక్షన్లు ఎలా ఉన్నాయనేది చూస్తే, ఓపెనింగ్ మరీ డల్ గా ఉన్నాయి. తక్కువ బడ్జెట్తో, ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన `రావు బహదూర్` స్థాయిలో ఈ మూవీ వసూళ్లు ఉండటం ఆశ్చర్యపరుస్తున్నాయి. `నాగబంధం` మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా రూ.5కోట్లు రాబట్టింది. ఇండియాలో దీనికి రూ.3.24కోట్లు రాబట్టినట్టు సమాచారం.
`నాగబంధం` మూవీ సుమారు రూ.100కోట్ల బడ్జెట్తో తెరకెక్కించారట. పెద్దగా కాస్టింగ్ లేని సినిమాకి ఈ స్థాయి కలెక్షన్లు అంటేనే షాకిస్తోంది. మేకర్స్ చాలా పెద్ద రిస్క్ చేశారని చెప్పొచ్చు. ఈ మూవీకి నాన్ థియేట్రికల్ రూపంలో గట్టిగానే రాబట్టింది. ఓటీటీ రైట్స్ రూపంలో రూ.45కోట్లు వచ్చాయట. శాటిలైట్ రైట్స్ రూ.28కోట్లు, ఆడియో రైట్స్ రూ.7కోట్లు వచ్చినట్టు సమాచారం. ఇలా రిలీజ్ కి ముందే ఈ మూవీకి రూ.80కోట్లు రికవరీ అయినట్టు సమాచారం.
ఇక థియేట్రికల్ రూపంలోనూ గట్టిగానే వచ్చింది. సినిమాకి తెలుగు రైట్స్ రూ.14కోట్లు, తమిళ రైట్స్, హిందీ రైట్స్, కన్నడ అన్నీ కలిపి రూ.4కోట్లు , ఓవర్సీస్ రైట్స్ నాలుగు కోట్లు అని సమాచారం. మొత్తంగా రూ.28కోట్లు థియేట్రికల్ రైట్స్ అని లెక్కకట్టారు. ఈ మూవీ థియేట్రికల్గా హిట్ కావాలంటే రూ.56కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టాలి. మరి ఈ మూవీకి వస్తోన్న టాక్కి ఇది సాధ్యమేనా అనేది పెద్ద ప్రశ్న. అయితే సినిమా విషయంలో నిర్మాతలు సేఫ్ అని చెప్పొచ్చు. కొన్న బయ్యర్లకి ఎంత వస్తాయనేదే ప్రశ్న.