
రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్, లైఫ్స్టైల్, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు.
గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.
Ayodhya Ram Mandir: రామ మందిర హుండీ చోరీ కేసు విచారణను అధికారులు మరింత వేగవంతం చేశారు. గురువారం మధ్యాహ్నం బృందం మళ్లీ అయోధ్యకు చేరుకుని విచారణ కొనసాగించింది. గతంలో ట్రస్ట్ సభ్యులు తనిఖీలను తప్పించుకునేవారని, ఈ ఘటనలో భద్రతా సిబ్బందిని పట్టించుకోకుండా లెక్కింపు సిబ్బందిని దుర్వినియోగం చేస్తూ భారీ దొంగతనం జరిగిందని తేలింది. ఈ ఘటన తర్వాత ఆలయ భద్రతలో అనేక కీలక మార్పులు చేశారు.
ఈ కానుకల దొంగతనం కేసులో పోలీసుల విచారణ ఇంకా కొనసాగుతోంది. గురువారం పోలీసులు నిందితుడైన అవినాష్ శుక్లను తొలిసారిగా 13 గంటల పాటు రిమాండ్కు తీసుకున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, అవినాష్కు 48 గంటల రిమాండ్ కావాలని పోలీసులు కోరగా, కోర్టు 13 గంటల రిమాండ్ను మాత్రమే మంజూరు చేసింది. అవినాష్ శుక్ల రిమాండ్ పై గురువారం కోర్టు విచారణ జరిగింది. రిమాండ్ ఎందుకు అవసరమో పోలీసులు తమ వాదనలు వినిపించగా, కోర్టు ఆమోదించింది.
జైలులో అవినాష్ను విచారించిన తర్వాత కొన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయని, ఆ నేపథ్యంలో అతని రిమాండ్ అవసరమని పోలీసులు కోర్టుకు తెలిపారు. దీనికి ముందు ట్రస్ట్ సభ్యుడు డాక్టర్ అనిల్ కుమార్ మిశ్రాను కూడా కొన్ని గంటల పాటు ప్రశ్నించారు. అనంతరం ఆలయ నిర్వాహకుడు గోపాలరావును పిలిచి ప్రశ్నిచారు. భక్తులు విరాళంగా ఇచ్చిన బంగారు ఆభరణాలు, భూముల కొనుగోలుకు సంబంధించిన వివరాలను కూడా అధికారులు సేకరిస్తున్నారు.
ఆలయ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ ఇచ్చిన వాంగ్మూలం సరిపోలిందో లేదో సిట్ అధికారులు పరిశీలిస్తున్నారు. ఈ నేపథ్యంలో మరికొందరు దాతలను, అలాగే భూముల కొనుగోలు వ్యవహారాలకు సంబంధించి వ్యక్తులను కూడా విచారించనున్నారు. అవినాష్ను మరింత సుదీర్ఘంగా విచారించనున్నారు, అవసరమైతే అతడిని ప్రతాప్గఢ్లోని స్వగ్రామానికి కూడా తీసుకువెళ్లే అవకాశం ఉంది. అతని బైక్ను కూడా స్వాధీనం చేసుకోవాల్సి ఉంది. దీనిపై మరింత దర్యాప్తు అవసరమని పేర్కొన్నారు.
పోలీసుల విచారణలో నిధులను దొంగలించి దుర్వినియోగం చేసినట్లు అవినాష్ అంగీకరించినట్లు సమాచారం. అతను ఇచ్చిన సమాచారం ఆధారంగా ట్రస్ట్ తరపున రూ.20,39,220, 1121 అమెరికన్ డాలర్లు, వెండి వస్తువు, రెండు బంగారు గొలుసులు,ఒక ఉంగరాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీంతో పాటు ఆలయ ప్రాంగణానికి వెళ్లిన పోలీసు బృందం, హుండీ నగదు లెక్కించే సిబ్బందిని కూడా విచారించింది. హుండీల నుండి నగదు తీసే విధానం, లెక్కింపు ప్రక్రియను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు.
కానుకల దొంగతనం తర్వాత ఆలయ భద్రతా ఏర్పాట్లు పూర్తిగా మారాయి. ట్రస్ట్ ఉద్యోగులు, భద్రతా సిబ్బంది ప్రవేశించేటప్పుడు, బయటకు వచ్చేటప్పుడు ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తున్నారు. ఆలయ ప్రవేశ ద్వారాల వద్ద కఠినమైన భద్రత ఏర్పాటు చేసి, క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే లోపలికి అనుమతిస్తున్నారు. ట్రస్ట్ ఉద్యోగులకు ముఖ గుర్తింపు (Face Recognition), బయోమెట్రిక్ ధ్రువీకరణ తప్పనిసరి చేశారు. హుండీ లెక్కింపు వద్ద కూడా మరింత కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.