
కొన్ని వారాలుగా పసిడి మార్కెట్ తీవ్రమైన హెచ్చుతగ్గులకు లోనవుతున్న తరుణంలో.. రాబోయే ఆరు నెలల్లో (2026 ద్వితీయార్థంలో) బంగారం ధరలు ఎలా ఉండబోతున్నాయనే అంశంపై 'వరల్డ్ గోల్డ్ కౌన్సిల్' (డబ్ల్యూజీసీ) తన...
కొన్ని వారాలుగా పసిడి మార్కెట్ తీవ్రమైన హెచ్చుతగ్గులకు లోనవుతున్న తరుణంలో.. రాబోయే ఆరు నెలల్లో (2026 ద్వితీయార్థంలో) బంగారం ధరలు ఎలా ఉండబోతున్నాయనే అంశంపై 'వరల్డ్ గోల్డ్ కౌన్సిల్' (డబ్ల్యూజీసీ) తన మధ్యంతర నివేదికను విడుదల చేసింది. అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, అమెరికా సహా వివిధ దేశాల సెంట్రల్ బ్యాంకుల వడ్డీ రేట్ల విధానాలు, పెట్టుబడిదారుల సెంటిమెంట్ రాబోయే రోజుల్లో బంగారం ధరలను శాసించనున్నాయని నివేదిక స్పష్టం చేసింది.రికార్డు గరిష్ఠం నుంచి భారీ పతనం 2026 ఏడాది మొదటి భాగం బంగారం మార్కెట్కు అత్యంత అస్థిరమైన కాలంగా నిలిచింది. జనవరి నెల చివరలో అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ధర ఔన్స్కు 5,405 డాలర్ల చారిత్రక రికార్డు స్థాయికి చేరింది. అయితే ఆ తర్వాత అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల తగ్గింపు అంచనాలు మారడం, డాలర్ బలోపేతం కావడం, ఇన్వెస్టర్లు పెద్ద ఎత్తున లాభాల స్వీకరణకు మొగ్గుచూపడంతో జూన్ చివరి నాటికి ధర 4,002 డాలర్లకు పడిపోయింది. ఇది రికార్డు గరిష్ఠం నుంచి దాదాపు 26 శాతం భారీ పతనం కావడం గమనార్హం.మార్కెట్ను ప్రభావితం చేసిన ముఖ్యాంశాలుఆసియా ఇన్వెస్టర్ల హవా: మొదటి భాగంలో అమెరికా-ఇరాన్ మధ్య రేగిన సైనిక ఉద్రిక్తతలు బంగారానికి రక్షణగా నిలిచాయి. నివేదిక ప్రకారం, ఆసియా, అమెరికా ట్రేడింగ్ సమయాల్లోనే బంగారం ధరల్లో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. దీన్ని బట్టి అంతర్జాతీయ పసిడి మార్కెట్లో ప్రస్తుతం ఆసియా దేశాల పెట్టుబడిదారులే అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నారని డబ్ల్యూజీసీ వెల్లడించింది.వడ్డీ రేట్ల భయం: ఈ